నేటి నుండి హనుమకొండ జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు…

నేటి నుండి హనుమకొండ జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు

#డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏ. అప్పయ్య

#99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కార్యక్రమం

#నలుగు దశల్లో వైద్య సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు

#ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

హన్మకొండ, నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు నాలుగు దశల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
మొదటి దశలో స్పెషలిస్ట్ వైద్య సేవలు మొదటి దశలో భాగంగా ఈనెల 6 నుండి 31 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్పెషలిస్ట్ వైద్యులతో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎంజీఎం, ప్రసూతి ఆసుపత్రుల నుండి స్త్రీ వైధ్య, శిశు వైధ్య, జనరల్ ఫిజీషియన్, కంటి మరియు ఎముకల వైద్య నిపుణులు ఈ శిబిరాల్లో అందుబాటులో ఉంటారు.
ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తారు.
పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు
ఆర్.బి.ఎస్.కె బృందాల ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. బాలికల పాఠశాలల్లో స్త్రీ వైద్య నిపుణులతో ప్రత్యేక అవగాహన సదస్సులు, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షణకు తోడ్పడే సిపిఆర్ పై శిక్షణ ఇస్తారని డీఎంహెచ్‌ఓ వివరించారు.
ప్రారంభమైన శిబిరాలు – షెడ్యూల్ వివరాలు
నేడు అయినవోలు పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన మొదటి వైద్య శిబిరాన్ని వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కె.ఆర్. నాగరాజు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి శిబిరాల షెడ్యూల్ ఇలా ఉంది:
| మార్చి 7 | కడిపికొండ |
| మార్చి 9 | కమలాపూర్ |
| మార్చి 10 | కొండపర్తి |
| మార్చి 11 | ముల్కనూర్ |
| మార్చి 12 | శాయంపేట |
| మార్చి 13 | సిద్దాపూర్ |
| మార్చి 14 | ఉప్పల్ |
| మార్చి 16 | వేలేరు |
| మార్చి 17 | దామెర |
| మార్చి 18 | హసన్పర్తి |
| మార్చి 20 | వంగర |
| మార్చి 23 | రాయపర్తి |
మార్చి 24న బోడగుట్ట, 25న లష్కర్ సింగారం, 26న పెద్దమ్మగడ్డ, 28న పోచమ్మకుంట/శాయంపేట, 30న సోమిడి/వడ్డేపల్లి, 31న తిరిగి పోచమ్మకుంట మరియు వడ్డేపల్లిలో శిబిరాలు జరుగుతాయి.
మహిళా సమాఖ్య సభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని, కావున ప్రజలందరూ తమ ఆరోగ్య పరిరక్షణకై ఈ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని డాక్టర్ అప్పయ్య కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version