`రజాకార్ వారసులకు సీతక్క లాంటి త్యాగశీలిని ప్రశ్నించే హక్కు అసలే లేదు.
`అక్భరుద్దీన్ తెలంగాణ వ్యతిరేకి.
`సీతక్క గురించి మాట్లాడే అర్హత అక్భరుద్దీన్కు లేదు.
`అక్భరుద్దీన్ వెకిలి భావన! అహంభావన!!
`సీతక్క మీద నోరు పారేసుకోవడం అక్భర్ కుసంస్కారం.
`తెలంగాణ మాతృభాష తెలుగు.
`తెలుగు రాకపోవడానికి అక్భర్ సిగ్గుపడాలి.
`అక్బర్ కేవలం ముస్లింలు ఓట్లేస్తేనే గెలవలేదు.
` అక్భర్కు తెలుగు రాకపోకపోవడం సిగ్గు చేటు.
`సీతక్క ‘‘లా’’ చదివిన ఆదివాసీ బిడ్డ
`సీతక్క పిహెచ్డి చేసిన మహిళా విద్యావంతురాలు.
`తెలంగాణ సమాజం కోసం తపన పడిన నాయకురాలు.
`తమ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన ధీర వనిత.
`ప్రజా జీవితంలోకి వచ్చి మూడు సార్లు ఎమ్మెల్యే అయిన ప్రజా ప్రతినిధి.
`సీతక్క ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రి.
`సీతక్కకు ఉర్దూ రావాల్సిన అవసరం లేదు.
`ఇంగ్లీష్ కచ్చితంగా రావాలన్న రూలేమీ లేదు.
`తెలంగాణ రాజ భాష సీతక్కకు వచ్చు.
`తన మాతృభాషలు గోండు, కోయ భాషలు వచ్చు.
`సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు ప్రజలు మాట్లాడుకునే తెలుగు వచ్చు.
`అక్బర్ కు తెలుగు రాకపోవడం ఆయన దౌర్భాగ్యం.
`తెలంగాణలో ప్రజా ప్రతినిధిగా వుంటూ అక్బర్ తెలుగు నేర్చుకోకపోవడం తప్పు.
`సీతక్కకు ఉర్దూ, ఇంగ్లీష్ రావాల్సిన అవసరం అసలే లేదు.
`అక్బర్ అహంకారం పూరిత వ్యాఖ్యలు సమర్థనీయం కాదు
తెలంగాణలో పుట్టి పెరిగి, చాంద్రాయణ గుట్ట నుంచి ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడుతూ, దశాబ్దాలుగా రాజకీయాలు సాగిస్తున్న ఎంఐఎం. ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఓవైసి నాకు తెలుగు రాదు. అర్ధం కాదని చెప్పడమే దౌర్భాగ్యం. సిగ్గు చేటు. పైగా మంత్రి సీతక్కకు ఇంగ్లీష్ రాదు, ఉర్ధూ రాదు అని ఎద్దేవా చేయడం పొరపాటు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాజ భాషగా అమలౌతున్న రాష్ట్రంలో మంత్రి సీతక్కకు ఇతర భాషలు రావంటూ నిండు అసెంబ్లీలో అనడం తప్పు. ఈ విషయంపై ఎమ్మెల్యే అక్భర్ మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే సీతక్కకు ఉర్దూ రావాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. కోర్టు తీర్పులే తెలుగులో ఇస్తున్న ఈ సందర్భంలో మంత్రి సీతక్కకు రెండు బాషలు రావంటూ అక్భర్ మాట్లాడడం ఆయన అహాంకారానికి నిదర్శం. అయినా తెలంగాణ నడి గడ్డలో వున్న అక్భర్కు తెలుగు ఎందుకు రాదు? నాకు రాదని చెప్పడం గొప్ప అనుకుంటున్నాడేమో? ఇంత వరకు ఈ విషయం ఎవరూ పట్టించుకోలేదు. కాని అక్భర్ నోరి తన కొరివితో తలగోక్కున్నట్ల్లైంది. సీతక్కకు అచ్చమైన తెలుగుభాష స్పష్టంగా వస్తుంది. ఆమె అనర్గళంగా తెలుగు రాస్తుంది. ఆమె ఉన్నత విద్యావంతురాలు. న్యాయశాస్త్రం చదవిన పట్టభద్రురాలు. అంతే కాదు పిహెచ్డి కూడా చేస్తోంది. అలాంటి సీతక్కకు బాషలు రావంటూ వెక్కిరించడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతోంది. అయినా ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు ఏపికి చెందిన ఏ నాయకుడు ఎప్పుడూ హిందీలో మాట్లాడిన సందర్భం లేదు. ఎన్టీఆర్ కూడా ఎన్నడూ అసెంబ్లీలో ఉర్ధూ మాట్లాడలేదు. చంద్రబాబు మాట్లాడలేదు. రాజశేఖరరెడ్డి మాట్లాడలేదు. రోశయ్య మాట్లాడలేదు. ఆఖరుకు కిరణ్కుమార్ రెడ్డికూడా మాట్లాడిరది లేదు. అప్పుడు ఎలా అర్ధమైంది అక్భరుద్దీన్ ..ఆ రోజుల్లో ఈ మాట ఎందుకు మాట్లాడలేదు? ఎందకంటే అప్పుడు అన్న అసద్దుద్దీన్ ఓవైసి, ఇటు అక్భర్ద్దీన్ తాట తీశారు. చంద్రబాబు హాయాంలో, కిరణ్కుమార్ రెడ్డి కాలంలో వీపు విమానం మోత మోగించారు. అందుకే అప్పుడు కుక్కిన పేనులా వున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు గౌరవిస్తుంటే చులకనగా కనిపిస్తుందా? గత ప్రభుత్వాలు వున్న తీరుగా వుంటేనే వింటారా? తెలంగాణలో ప్రజా ప్రతినిధిగా వుంటూ అసెంబ్లీలో 95శాతం చర్చలు పూర్తిగా తెలుగులోనే జరుగుతుంటాయి. మరి అవి ఎలా అర్ధమౌతున్నాయి. ఏం అర్దం చేసుకుంటున్నారు? ఎంఐఎం పార్టీలో తెలుగు నాయకులు లేరా? వారు చెప్పే సమస్యలు ఎలా వింటున్నారు. ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి చెప్పినప్పుడే అర్ధం కావడం లేదా? మంత్రి సీతక్క ఉర్దూ, ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు..ముందు అక్భర్ తెలుగు నేర్చుకో.. అక్భర్కు వచ్చిన బాషలోనే సభలో సమాదానమివ్వాలని రూలేం లేదు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో తెలుగుబాష రాని వారిని ప్రజలు ఎన్నుకోవద్దన్న నిర్ణయం తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది తెలుగు విలువ. తెలంగాణ విలువ. తమిళ నాడులో ఎక్కడికి వెళ్లినా తమిళమే కనిపిస్తుంది. తమిళంలో తప్ప మరో బాషలో వాళ్లు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ల బాష అంటే వాళ్లకు అంత అభిమానం. అది వాళ్ల ఆత్మగౌరవం. తెలంగాణ ప్రజలకు చాలా మందికి ఉర్దూ వస్తుంది. మరి మీకు తెలుగు ఎందుకు రాదు! తెలుగు కవువులు ఎంతో మంది ముషాయిరాలు రాశారు. మాజీ ప్రధాని పివి. నర్సింహారావు లాంటి వారు ఉర్ధూలో అనేక పుస్తకాలు రాశారు. అంతకన్నా ఎంఐఎం.నాయకులు అంతకన్నా గొప్పవారా? తెలంగాణలో వుంటూ తెలుగు రాదంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎంఐఎం. నాయకులు దెబ్బతీయడమే. తెలంగాణను అవమానించడమే అవుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర కావాలనికోరుకున్నది ఎంఐఎం. తెలంగాణ ఇచ్చేది వుంటే రాయల తెలంగాణ కావాలని కోరుకున్నది ఎంఐఎం. అలాంటి పార్టీకి కూడా తెలంగాణ ప్రభుత్వాలు ఎంతో గౌరవాన్ని ఇస్తున్నాయి. కాని ఆ గుర్తింపును ఎంఐఎం నిలుపుకోవడం లేదు. అక్భర్ లాంటి వారు ఆ గౌరవాన్ని పొందడానికి అర్హులు అసలే కాదు. అక్భర్ పిడికెడుమంది ప్రజలకు మాత్రమే ప్రతినిధిని అనుకుంటున్నారు. కాని సీతక్క అలా కాదు. యావత్ తెలంగాణ రాష్ట్రానికి సీతక్క ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి. ఆ సంగతి మర్చిపోయి అక్భర్ చిల్లర వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ సమాజం తీవ్ర అభ్యంతరం తెలియజేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కూడా తప్పు పట్టాల్సిన అవసరం వుంది. నిండు సభలో అక్భరుద్దీన్ సీతక్కను అవమాన పర్చే అర్ధం సృరించేలా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా సరైంది కాదు. అప్పుడే అక్భర్ను నిలువరించేది వుండే..అక్భర్ చేత సభలో క్షమాపణ చెప్పించాల్సి అవసరం వుండే. కనీసం సీతక్కకు ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే సపోర్టుగా మాట్లాడకలేకపోయారు. సీతక్క తన ప్రజల కోసం పడినశ్రమ అంతా ఇంత కాదు. ఆమె జీవితమంతా పేద ప్రజల కోసమే సాగింది. రాజాకార్ వారసుడైన అక్భరుద్దీన్కు సీతక్క లాంటి త్యాగశీలిని ప్రశ్నించే హక్కు లేదు. సీతక్క పేరు పలికేందుకు కూడా అర్హత లేదు. అక్భరుద్దీన్ది వెలికి భావన. తెలంగాణ రాజభాష తెలుగు. అక్భరుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాంద్రాయణ గుట్టలో సగం మంది హిందువులు,తెలుగు ప్రజలే వుంటారు. తెలుగు ప్రజల ఓట్లతో గెలిచిన అక్బర్కు తెలుగు రాకపోవడం సిగ్గు చేటు. సీతక్క పీడిత ప్రజల కోసం చేసిన పోరాటంలో అక్బర్ ఒక్క శాతం కూడా చేసింది లేదు. సీతక్క తన ప్రాణాలను ఫణంగా పెట్టి పీడిత, తాడిత ప్రజలకోసం అడవికెళ్లి పోరాటం చేసింది. పీడిత ప్రజల్లో చైతన్యం నింపింది. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత తన ప్రజల కోసం రక్త దారపోస్తోంది. తన నియోజకవర్గ ప్రజలకోసం కొండలు, కోనులు, వాగులు, వంకలు దాటుతూ వారి కోసం నిత్యావసర వస్తువులు నెత్తి మీద పెట్టకొని తీసుకెళ్లి ఇస్తుంది. అలాంటి ప్రజా ప్రతినిధి మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా వుండకపోవచ్చు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కారు నుంచి కాలు కింద పెట్టకుండా రాజకీయం చేసేవారే ఎక్కువ. కాని సీతక్క తాను ఎమ్మెల్యేను అనే భావన కూడా వుండదు. నిత్యం ప్రజల్లో వుంటుంది. ప్రజల కోసమే ఆమె జీవిస్తోంది. వానాకాలంలో వాగులు వంకలు దాటుకుంటూ వెళ్లి ఆమె చేసే సేవలు చూసే వారిలో కూడా కన్నీళ్లు తిరుగుతాయి. నడి ఎండా కాలంలో సీతక్క కొండలు కోనలు దాటుకుంటూ తన ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం ప్రపంచమంతా చూసింది. ఇక కరోనా సమయంలో ఆమె చేసిన సేవలు మరెవరూ చేసి వుండరు. అలాంటి సేవలు ఏ ఒక్క నాడైనా అక్భరుద్దీన్ చేశాడా? కరోనా కాలంలో ప్రజల మధ్య ఏనాడైనా వున్నాడా? తెలంగాణను చిన్నా భిన్నం చేసిందే రజాకార్లు. కాసింరజ్వీ స్దాపించిన ఎంఐఎం పార్టీని ఇంకా తెలంగాణలో ప్రజలు ఆదరించడమే గొప్ప. కాసిం రజ్వి పోయిన తర్వాత అలాంటి పార్టీని నడిపిస్తూ, రాజకీయాలు చేస్తుంటే కూడా తెలంగాణ సమాజం ఎంఐఎంను సహిస్తోంది. ఆదరిస్తోంది. అది తెలంగాణ ప్రజల గొప్ప గుణం. అలాంటి ప్రజల ఓట్లతో గెలుస్తూ తెలుగును కించపర్చే అర్దం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. తెలంగాణ కోసం కొట్లాడిన నాయకురాలు సీతక్క. గిరిపుత్రుల హక్కుల సాధన కోసం పోరాటం చేసిన ధీర వనిత సీతక్క. ప్రజా జీవితంలో సేవ చేసుకుంటూ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం మంత్రిగా సేవలు చేస్తున్నారు. ప్రజా సేవ చేసేవారికి బాషతో పనిలేదు. ప్రజల మనసు తెలిస్తే చాలు. ప్రజల సమస్యలు తెలిస్తే చాలు. వాటిని ఎలా పరిష్కరించాలో తెలిస్తే చాలు. అంతే కాని ఉర్ధూ రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇదే మాట ఉమ్మడి రాష్ట్రంలో అనేదే వుంటే తాట తీసేవారు. చార్మినార్ వద్ద పోలీసులు ఎలాంటి చికిత్స చేశారో..అలాంటి చికిత్స అసెంబ్లీలో కూడా జరిగేది. తెలంగాణ ఎమ్మెల్యేలలో చాలా మందికి ఉర్ధూ రాదు. వాళ్లు మంత్రుల అయ్యే అవకాశం లేనట్లా? నీకు ఇంగ్లీష్ వస్తుందని వాళ్లకు రాకుంటే ఎంఐఎం దృష్టిలో వారికి విలువ వుండదా? ఇప్పటికైనా అక్భరుద్దీన్ ఇలాంటి తిక్క మాటలు మానుకోకపోతే తెలంగాణ ప్రజల చేతిలో ఎంఐఎంకు నూకలు చెల్లక తప్పదు.