మంచిర్యాల, నేటి ధాత్రి:
సింగరేణి అధికారుల అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,సింగరేణి సంస్థ సీఅండ్ ఎండీ బలరాం,ఇతర అధికారుల బృందం అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం నెవాడా-అరిజోనా సరిహద్దులో ఉన్న ఐకానిక్ హూవర్ డ్యామ్ను సందర్శించారు.ఈ సందర్భంగా ఆనకట్ట మెకానిజం గురించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు.ఇందులో ఒక్కొక్కటి 130 మెగావాట్ల ఉత్పత్తి చేసే13 టర్బైన్ లతో పాటు 127, 68.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు అదనపు టర్బైన్లు ఉన్నాయి. వీటి పూర్తి రూప కల్పన, పనితీరు, మెయింటెనెన్స్ ఖర్చులు గురించి పూర్తి వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.