కార్తీక మాసం కోటగుళ్లలో సాయి చైతన్య ఐపీఎస్ పూజలు

ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యానికి మేలు

హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయ కాలక్షేత్రం కోటగుళ్లలో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు

కార్తీక మాసం ఎంతో పవిత్రమైందని ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో ఎస్పి పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్ అన్నారు. కార్తీకమాస ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆయన గడప సముద్రం సరస్సు కట్ట పై కొలువైన దక్షిణముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్లలోని గణపతి నందీశ్వరుడు గణపేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు సాయి చైతన్యను శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version