కోటగుళ్లలో నందీశ్వరుడికి రుద్రాభిషేకం

కోట గుళ్ళ లో ఘనంగా సోమవతి అమావాస్య పూజలు

గణపేశ్వరుడు, నందీశ్వరునికి రుద్రాభిషేకం

పట్టు వస్త్రాలతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ

భారీగా తరలివచ్చిన భక్తజనం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో సోమవారం సోమవతి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో అర్చకులు జూలపల్లి నాగరాజు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం నందీశ్వరునికి గణపేశ్వరునికి, పంచామృతాలతో రుద్రాభిషేక నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామి వారిని, భవాని మాతను ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు పూలమాలతో అలంకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు సోమవతి అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version