భారత ప్రజలకు హోం మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో హోంమంత్రి అమిత్ షా చిత్రపటాల దహనం-నిరసన
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :
భారత రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని తీసుకువచ్చే కుట్రలో భాగంగానే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవహేళనగా మాట్లాడి బహుజన సమాజాన్ని అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలని, భారత రాజ్యాంగంపై అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా కు ఏమాత్రం గౌరవం ఉన్న తక్షణమే భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వాక్యాలు చేసిన కేంద్ర బిజెపి హోం మంత్రి అమిత్ షా వైఖరిని ఖండిస్తూ సోమవారం వామపక్షాల పిలుపుమేరకు ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో అమిత్ షా చిత్రపటాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది భారత సమాజంలోని అణగారిన వర్గాల బిడ్డగా భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను నిండు పార్లమెంటులో ఏక వచనంతో సంబోధిస్తూ అవహేళనగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడడం భారత రాజ్యాంగంపై ఆయనకు బిజెపికి ఉన్న గౌరవం ఏ పాటిదో అర్థం అవుతుందని బిజెపి మనువాద సిద్ధాంతానికి ఇది మచ్చుతునకలాగా కనపడుతుందని జనాభాలో అధిక శాతంగా ఉన్న దళితులు, గిరిజనులు, బహుజనులు అణిచివేయబడి ఉండాలనేదే బిజెపి ఆర్ఎస్ఎస్ ఉద్దేశమని, కష్టజీవులైన బహుజనులను దోచుకుంటూ అణచివేసి అగ్రవర్ణ పాలన కొనసాగించాలని బిజెపి ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బిజెపి ఎన్డీఏ ప్రభుత్వానికి అంబేద్కర్ పై ఏమాత్రం గౌరవం ఉన్న తక్షణమే హోం మంత్రిగా అమిత్ షాను భర్తరఫ్ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్యాంగ పరిరక్షణకు లౌకికత్వానికి దేశ సమగ్రతకు సమాజ శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ క్రమంలో బిజెపి ఆర్ఎస్ఎస్ మనువాద పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్ నాయకులు ఎగ్గెని మల్లికార్జున్ ఐతం నాగేష్ అప్పనపురి నర్సయ్య నలవెల రవి రాయినేని ఐలయ్య జటబోయిన నరసయ్య మల్లికార్జున్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.