శివాలయాన్ని ప్రారంభించిన రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఎమ్మెల్యే ను సన్మానించిన కొత్తగట్టు గ్రామస్థులు

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం కొత్తగట్టు గ్రామంలోని పరమేశ్వర దివ్య శివలింగ సహిత గణపతి గ్రామ దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శనివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అనంతరం శివాలయము,పోచమ్మ తల్లి దేవాలయాలను ప్రారంభించారు.ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా గ్రామానికి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సత్కరించారు.దేవాలయ పూజారులు పూర్ణకుంభంతో ఆహ్వానించి ఆశీర్వచనలు అందించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా భక్తిశ్రద్ధలతో శ్రీ పరమేశ్వర దివ్య శివలింగ సహిత గణపతి గ్రామ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని జరుపుకోవడమే కాక పోచమ్మ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసుకొని అత్యంత వైభవంగా నిర్వహించుకోవటం ఆనందకరమన్నారు.గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన వలన గ్రామంలో ఐక్యత,శాంతి సౌభాగ్యాలకు నిలయంగా ఉంటుందన్నారు.ఆ శివుని ఆశీస్సులతో గ్రామ ప్రజలతోపాటు నియోజకవర్గ ప్రజలకు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గుడి నిర్మాణదాత పరుపాటి రోజా ప్రవీణ్ రెడ్డి,ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్,ఆత్మకూరు జడ్పిటిసి కక్కెర్ల రాధిక రాజు,ఆత్మకూరు పీఏసీ చైర్మన్ ఏరుకొండ రవీందర్,కొత్తగట్టు గ్రామ సర్పంచ్ బోల్ల లావణ్య నరేష్ , కొత్తగట్టు గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ రమ్యా సతీష్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, కొత్తగట్టు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మండల అధ్యక్షులు కమలాపురం రమేష్ ,పరకాల పట్టణ 4వ వార్డు అధ్యక్షులు బొచ్చు కుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిల్లెల్ల ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడివెండి రాణా ప్రతాప్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version