రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖలను సద్వినియోగం చేసుకోవాలని న్యాల్కల్ రెవెన్యూ అధికారులు కోరారు. న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ఈ సదస్సులో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.