నేటిదాత్రి కథనానికి స్పందన.

మరమ్మత్తు పనులను చేయించిన విద్యుత్ అధికారులు.

చిట్యాల, నేటి దాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని పాత సిడిపిఓ ఆఫీస్ దగ్గర గల విద్యుత్తు తీగలు చెట్టు లోపల నుండి విద్యుత్తు సరఫరా లైను, వర్షం పడితే కొమ్మను ముట్టుకుంటే షాక్, గురించి సోమవారం నేటి ధాత్రి దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన విద్యుత్ అధికారులు మంగళవారం రోజున అడ్డుగా ఉన్న చెట్లను విద్యుత్ సిబ్బంది తొలగించి విద్యుత్ సరఫరా చేయడం జరిగింది, వెంటనే స్పందించి విద్యుత్ మరమ్మత్తు పనులను చేసిన అధికారులకు మరియు నేటి దాత్రి దినపత్రిక ప్రచురించిన కథనానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు, ఏది ఏమైనా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యలను పరిష్కరించడంలో నేటిదాత్రి ఎప్పుడు ముందుంటుందని పలువురు అనుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version