చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని జేఏసీ,మరియు అఖిలపక్ష పార్టీల తీర్మానం

చేర్యాల నేటిధాత్రి…
చేర్యాల రెవెన్యూ డివిజన్ ను సాదించాలని,అలాగే చేర్యాల నియోజకవర్గన్నీ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బిరన్న అధ్యక్షతన చేర్యాల పట్టణంలో ని ఓ ప్రైవేట్ కళాశాల లో సన్నాహక సమావేశం జరిగింది, చేర్యాల రెవెన్యూ డివిజన్ పోరాటం గత ఏడూ సవత్సరాలుగా ఉద్యమం జరుగుతుంది ఈ పోరాటంలో చేర్యాల, చేర్యాల రూరల్, కొమురవేల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల లోని యాబై మూడు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఈ పోరాటంలో అంచెలంచెలుగా పాల్గొంటున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ,బీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్ రెడ్డి వాగ్దానం ఇచ్చారు,మాట తప్పారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థి ఓటమి చెందిన ఇంచార్జి కొమ్మురి ప్రతాప్ రెడ్డి లు కూడా జనగామ ఎన్నికల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తాము అధికారంలోకి వస్తే చేర్యాల ను రెవెన్యూ డివిజన్ చేస్తామని ప్రకటించారు, కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఆరు నెలలు గడిచిన చేర్యాల రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడకపోవడం సిగ్గు చేటని మాట తప్పిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు అడుగడుగునా నిలదీయాలని సమావేశం. తీర్మానించింది,చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం ప్రజల మద్దతు తో జేఏసీ,రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా,&కుల సంఘాల తో కలసి జూన్ 1 వ తేదీన సమావేశం ఐ అంచలేంచెల పోరాటా కార్యాచరణ రూపొందిస్తామని సమావేశం తీర్మానించింది,ఈ లోపే ప్రభుత్వం నుండి స్పషమైన ప్రకటన చేయాలని సమావేశం కోరింది, ప్రకటన రాకపోతే గ్రామాలలో అధికార కాంగ్రెస్ పార్టి నాయకులను అడుగడుగునా అడ్డుకుంటామని సమావేశం హెచ్చరించింది,ఈ కార్యక్రమంలో సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి,జేఎసీ నాయకులు తాడెం ప్రశాంత్, బిజ్జ రాము,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బురూగు సురేష్,జిల్లా కార్యదర్శి తోకల ఉమారాణీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి నారాయణ రెడ్డి,సీపీఎం పార్టీ వివిధ మండలాల కార్యదర్శులు కొంగరి,వెంకట్ మావో,ఆలేటి యాదగిరి, చొప్పరి రవి కుమార్,పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు,మాజి సర్పంచ్ తాడూరి రవీందర్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బండకింది అరుణ్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ,కుర్మ సంఘం నాయకులు కామళ్ల అనీల్, ఓరుగంటి శంకర్,బిజెపి పార్టీ చేర్యాల పట్టణ అధ్యక్షులు మన్నే సత్యవర్ధన్, సీపీఎం నాయకులు బోయిని మల్లేశం,ఆముదాల నర్సిరెడ్డి,ఎర్రబోస్ అశోక్ ,ముస్త్యాల ప్రభాకర్,మంచాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version