జెండా ఆవిష్కరించిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రేపాక రాజేందర్
గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు రేపాక రాజేందర్ గారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన వైస్ ఎంపీపీ అశోక్ కో ఆప్షన్ సభ్యులు చోటే మియా ఈ సందర్భంగా మాట్లాడుతూ
భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి మన దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే
పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది.
అలా. 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా, భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం అని అశోక్ అన్నారు
ఈ కార్యక్రమంలో గణపురం ప్రజా ప్రతినిధులు జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు