ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ లో 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చీఫ్ ఇంజనీర్ ముస్త్యాల సిద్ధయ్య అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ. వారి ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ.. విద్యుత్ ఉద్యోగులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఇటీవల కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోల్ ప్లాంట్ ఆవరణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన భూపాలపల్లి జిల్లా జంగేడు గ్రామానికి చెందిన బుర్ర కొమురయ్య కూతుర్లు అక్షిత కీర్తణ లకు 2,06000 రూపాయల చెక్కు అందజేయడం జరిగింది అలాగే ప్లాంట్ ప్రధాన ముఖద్వారం వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆల్ సుపరింటెండింగ్ ఇంజనీర్లు, ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు విద్యుత్ ఉద్యోగులు అర్టీజన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version