మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఇటీవలే వెలువబడిన డీఎస్సీ ఫలితాల్లో ఎస్ జి టి ఉపాధ్యాయుని గా నవాబుపేట మండలం యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన తమ్మలి రవీందర్ ఎన్నికైన సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఆవరణలో యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన యువకులు రవీందర్ ను సన్మానించారు.. ఈ సందర్భంగా రవీందర్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు యువకులు హర్షం వ్యక్తం చేశారు.