నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
తెలంగాణ సంస్కృతికి ముగ్గుల పోటీలు ప్రతీక అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొనిఅఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలోముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ముగ్గుల పోటీలకుఆర్థికసహకారం అందించినకాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలో భాగంగా ఇలాంటి ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమనివారు అన్నారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ తోటకూరి వెంకన్న,కాంగ్రెస్ నాయకులుచెనగోని నందు, ఎం జంగయ్య మాట్లాడుతూ, ఇలాంటి ముగ్గులు పోటీలు నిర్వహించేందుకుతమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారుతెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసంకృషి చేస్తుందనివారు అన్నారు. అనంతరం ఈ ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆ గ్రామ మాజీ సర్పంచ్ తోటకూరి వెంకన్న, చెనగోని నందు, ఎం జంగయ్య చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి టి. యమునా, ద్వితీయ బహుమతి సాగర్ల సరిత, తృతీయ బహుమతివీణ, నాలుగో బహుమతి, సైదమ్మ అందుకున్నారు.ఈ కార్యక్రమంలో భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మండల నాయకురాలు గౌసియాబేగం,పుష్ప, ఎం నవ్య,గౌతమి,దీపిక,,మౌనిక,సరస్వతి,నాగమణితదితరులు పాల్గొన్నారు