భద్రాచలం నేటి ధాత్రి
అడుగడుగునా భారీ కేడ్లు పెట్టి స్థానిక ప్రజలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం
బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం లో రాముడి భక్తులకు స్థానికంగా ఉండే భక్తుల కంటే వివిఐపి లకు వీఐపీలకే అధికార యంత్రాంగం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని. సామాన్య భక్తులకు. స్థానికంగా భద్రాచలంలో నివాసం ఉండే భక్తులకు శ్రీ రాముడి దర్శనం భాగ్యం కల్పించే పరిస్థితి కనపడటంలేదని
బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ విమర్శించారు..
అనేక ఏళ్లుగా భద్రాచలంలో అనేక ఉత్సవాలు జరిగాయని ఎటువంటి ఉత్సవాల్లో లేని అతి ఉత్సాహం అధికార యంత్రాంగంలో కనబడుతుందని. భద్రాచలం పట్టణంలో స్థానికంగా నివాసం ఉండే ప్రజలను కూడా గుడి వైపు వెళ్లే విధంగా వీలు లేకుండా అడుగడుగున బారి గేట్లు పెట్టి నిర్బంధానికి గురి చేస్తున్నారని..
ప్రజా ప్రతినిధుల సిఫారసు లెటర్స్ ఇచ్చి ప్రజా ప్రతినిధులు వచ్చిన రాకపోయినా వారి పేర్లమీద వారిపాసులు తీసుకుని సామాన్య భక్తుల కంటే ముందుగా వారి అనుచర యంత్రాంగం పాసులు ఉపయోగించుకుంటుందని విమర్శించారు…
స్థానికంగా ఉన్న రెవెన్యూ యంత్రాంగం కూడా ప్రజా ప్రతినిధుల సిఫార్సు లెటర్లు తీసుకొని అట్టి ప్రజా ప్రతినిధులు వస్తున్నారా లేదా తెలుసుకొని పాసులు మంజూరు చేయాలని అన్నారు…
వీఐపీలు వివిఐపీల వారికి అధికార యంత్రాంగo ఇస్తున్న ఫోటో కాల్ వల్ల స్థానిక ప్రజలకు దర్శన భాగ్యం కలగటంలేదని దైవ దర్శనం ముందు అందరూ సమానమని సంకేతాన్ని అధికార యంత్రాంగం గుర్తించుకోవాలని అన్నారు…