రామన్న పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం

ఇందిరమ్మ రాజ్యం లోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది..

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ఇందిరమ్మ రాజ్యం లోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం, రామన్న పల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం రోజు ఆయన ప్రారంభించరు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి గ్రామస్థాయి లోనే ‌బీజం పడాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో పదవతరగతి, ఇంటర్ మరియు డిగ్రీ చదివిన యువతకు త్వరలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో చేర్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ యశోద, పిఆర్ఎఇ సురేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వై. అచ్చన్న, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కార్యదర్శి టంకర కృష్ణయ్య యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, నాయకులు శ్రీశైలం యాదవ్, రఘుపతి రెడ్డి, యాదన్న యాదవ్, గోపాల్, కృష్ణయ్య, అంజి, చంద్రయ్య , తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version