గణపురం ,నేటి ధాత్రి: గణపురం మండల కేంద్రంలో
విప్లవ యుద్ధనౌక . ప్రజా గొంతుక ఎప్పుడూ ప్రజల వైపు ఉంటూ ప్రజలను చైతన్య పరుస్తూ ప్రభుత్వాలను ఎండగడుతూ తెలంగాణ ఉద్యమంలో తనా వంతు పాత్ర పోషించి, ప్రజా సమస్యల తన సమస్యలుగా భావించి, ప్రజలతో మమేకమై జీవనం గడిపిన గద్దర్ మరణం తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ తెలియజేయడం జరిగింది. నివాళులు అర్పించడానికి వచ్చిన ముఖ్య అతిథులు భూపాల్ పల్లి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి భువన సుందర్, వాణిజ్య శాఖ మండలాధ్యక్షుడు, కట్కూర్ శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ, సీనియర్ నాయకులు మామిళ్ల మల్లికార్జున్ దూడపాక దుర్గయ్య, వార్డు మెంబర్ మోటార్ రాజేష్. బుక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది
