పీపీ,లకు ఏపీపీ,లకు ప్రశంశించిన జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ.

నేర రహిత సమాజముగా తీర్చిదిద్దటమే ఎస్పి లక్ష్యం.

అధికారులపై బాధితులకు నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్కరు పని చేయాలి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లాలో
శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు కాన్ఫరెన్స్ హాల్లో, పీపీ,ఏపీపీ లు, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్స్ మరియు కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమీక్షా సమావేశమై, నేరస్తులకు శిక్షపడేటట్లు చేసిన పీపీ, లకు ఏపీపీ,లకు ప్రశంశించిన జిల్లా ఎస్పీ .

నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా కోర్టు పోలీసు సిబ్బంది శ్రమించాలని, న్యాయ శాఖా వారి సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ శిక్షల శాతం పెంచాలని అన్నారి అలాగే నేరస్తులకు శిక్షలు పడుటకు కోర్ట్ డ్యూటీ పోలీస్ అధికారులు కృషి చేయాలని కోర్టు డ్యూటీ ఆఫీసర్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని నేరస్థులు శిక్షల నుండి తప్పించుకోకూడదని అన్నారు. అలాగే కోర్ట్, వారెంట్స్ , సమన్స్, ఎంసీస్,వర్టికల్స్ గురించి పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కోర్ట్ కానిస్టేబుల్ అధికారులు తమ విధిలో భాగంగా ఎప్పటికప్పుడు ఎన్.బి.డబ్లూ.(నాన్ బేలబుల్ వారెంటులను) క్రమం తప్పకుండా అమలు పరిచి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా కృషిచేయాలని, కన్విక్షన్ రేటును పెంచాలని అన్నారు. కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా కోర్టు పోలీసు సిబ్బంది శ్రమించాలని, ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు కానిస్టేబుల్ ప్రత్యేక శ్రద్ద, బాధ్యత తీసుకోవాలని సూచించారు. కోర్టు నందు ఎఫ్ఐఆర్ లను సరైన సమయంలో అందించాలని. కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీని సరైన సమయంలో కోర్టు నందు డిపాజిట్ చేయాలి. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషిచేయాలని, నేరస్తులకు వారంట్స్, సమన్స్, సత్వరమే ఎగ్జిక్యూటివ్ అయ్యే విధముగా చర్యలు తీసుకోవాలని, కోర్టు ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తెలియజేయాలని, కోర్ట్ క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని మరియు కేసు ట్రయల్స్ సమయములో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు సూచనలు స్వీకరించాలని, కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్స్, సమన్స్, సి.సి.టి.యన్.యస్ లో ( కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్) లో డాటా ఎంటర్ చేయాలని సూచించారు. కోర్టు నందు ట్రయల్ జరిగిన కేసులు ఎంటర్ చేసినచో పెండింగ్ లేకుండా వుంటుందని తెలిపారు. భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, భాదితులకు మరింత నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు , ఎ, డి, డి, ఎల్,. పీపీ,శ్రీ రాంబక్ష్, పీపీ,శ్రీ జనార్దన్ , ఏపీపీ లు, డీ.ఎస్.పి శ్రీ వెంకట రమణ రెడ్డి, కోర్ట్ మానిటరింగ్ ఇన్స్పెక్టర్ సర్ బషీర్కో, ర్ట్ లైజనింగ్ ఆఫీసర్స్, కోర్టు కానిస్టేబుళ్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version