`జర్నలిస్టులను బెదిరిస్తే ఊరుకోం : జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ‘‘అన్నంచిన్ని వెంకటేశ్వరరావు.
`ఈ విషయంపై తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్లు ప్రకటించిన దళిత హక్కుల పోరాట సమితి.
వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘి ఎలేందర్.
`త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామన్న సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి.
`రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రకటించారు.
`రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులలో ప్రజా ప్రయోజన వాజ్యాలు వేయాలని సమాలోచనలు!
`త్వరలో కోర్టులను ఆశ్రయించనున్న ప్రజా సంఘాలు.
`అక్రమ మిల్లర్లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు.
`రైతులను మోసం చేసినట్లు తేట తెల్లమైనా అధికారులు చలించకపోవడంపై ప్రజా సంఘాల ఆగ్రహం.
`హన్మకొండ జిల్లాలో ఓ మిలర్ల్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.
`జాయింట్ కలెక్టర్ కూడా మోసం జరిగినట్లు కమీషనర్కు నివేదిక పంపడం జరిగింది.
`ఖమ్మం జేసి సదరు మిల్లర్పై చర్యలకు సిఫారసు చేయడం కూడా జరిగిపోయింది.
`ఇంకా మిల్లర్ పై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలు.
`రైతులను మోసం చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించేది లేదని ప్రజా సంఘాల హెచ్చరిక.
`హన్మకొండ జిల్లాలో రైతులను మోసం చేసిన మిర్లర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్.
`సివిల్ సప్లయ్ అధికారులు స్పందించకపోతే ఆందోళనకు ప్రజా సంఘాల కార్యాచరణ.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఆరుగాలం శ్రమించే రైతులను మోసం చేయడం కొంత మంది మిల్లర్లకు అలవాటైంది. రైతులు కష్టం దోచుకోవడం నేర్చుకున్నారు. రైతులు పండిరచిన వడ్లను దోచుకొని కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ అదికారులు చోద్యం చూస్తున్నారు. తప్పు చేసిన మిల్లర్లను ఉపేక్షిస్తున్నారు. రైతులను మోసం చేస్తున్న అక్రమ మిల్లర్లపై చర్యలు తీసుకోవడం వదిలేసి, వారికి అధికారులు వంత పాడుతుంటారు. సహకరిస్తుంటారు. మిల్లర్ల అక్రమ సంపాదనలో అధికారులు కూడా అక్కడక్కడ భాగస్వాములౌతున్నారని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సంఘి ఏలేందర్ ఆరోపించారు. రైతులను మోసం చేస్తున్న మిల్లర్లకు వ్యతిరేకంగా త్వరలో తమ పార్టీ,సంఘాల ఉద్యమ కార్యాచరణ వుంటుందని వేర్వేరు ప్రకటనల్లో తెలియజేశారు. అంతే కాకుండా త్వరలోనే రైతు సంఘాలను కలుపుకొని పెద్దఎత్తున నిరసలు తెలియజేస్తామన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్సప్లై అధికారులకు రిప్రజెంటేషన్లు ఇవ్వడంతోపాటు, అన్ని జిల్లాలలోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కోర్టులల్లో దాఖలు చేస్తామని నేటిధాత్రితో తెలిపారు. ఈ సందర్భంగా రవి, ఏలెందర్లు నేటిధాత్రితో మాట్లాడుతూ రైతులను అన్యాయానికి గురి చేస్తున్న మిల్లర్లను ఇక ఉపేక్షించేది లేదని వారికి శిక్షలు పడే వరకు తమ పోరాటం సాగుతుందన్నారు. నేటిధాత్రి అక్రమ మిల్లర్లపై సాగిస్తున్న అక్షర పోరాటాన్ని చాలా కాలంగా గమనిస్తున్నామన్నారు. అయినా కొంత మంది మిల్లర్లలో మార్పులు రావడం లేదన్నారు. అలాంటి మిల్లులు మూత పడేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. మిల్లర్లు మింగిన రైతుల సొమ్ము కక్కించే వరకు తమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టు రాష్ట్ర శాఖతోపాటు, అన్ని జిల్లాల శాఖలను కూడా అప్రమత్తం చేస్తామన్నారు. ఏక కాలంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలతోపాటు, తెలంగాణలోని అన్ని రాష్ట్రాలలోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తామన్నారు. అంతే కాకుండా అన్ని జిల్లాల్లోని సివిల్ సప్లయ్ కార్యాలయాల ముందు, అక్రమ మిల్లర్లు నిర్వహిస్తున్న మిల్లుల మందు కూడా నిరసనలు తెలియజేస్తామన్నారు. రైతుల పొట్ట గొడుతున్న మిల్లులను మూసి వేస్తే గాని మిగతా మిల్లర్లల్లో మార్పులు రావన్నారు. రైతులతో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే కూలిపోయిన ఘటనలు దేశంలో అనేకం వున్నాయన్నారు. రైతు చట్టాలలో మార్పులు తెస్తామని కేంద్రం నిర్ణయం తీసుకుంటే రైతుల పక్షాన ప్రజా సంఘాల పోరాటం ఎలా విజయం సాదించిందో అందరికీ తెలుసన్నారు. మన దేశంలో రైతు చట్టాలు ఎంత బలంగా వున్నాయో అవగాహన లేని కొంత మంది అక్రమ మిల్లర్లు రైతులను మోసం చేయడం చిన్న వ్యవహారం అనుకుంటున్నారని ఆక్షేపించారు. వడ్ల విషయంలో రైతులను మోసం చేయడం పెద్ద నేరమన్న సంగతి తెలిసి కూడా మిల్లర్లు మోసం చేస్తే వారికి శిక్ష తప్పదన్నారు. గత కొంత కాలంగా నేటిధాత్రి దినపత్రికలో వస్తున్న వరుస కథనాలు చూస్తున్నామన్నారు. రైతుల కోసం నేటిధాత్రి ఇంత పోరాటం సాగిస్తుంటే తాము మౌనంగా వుండడం సరైందికాదని నిరసనలు తెలియజేయాలని, ఉద్యమాలు సాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన ఒక్క మిల్లరే ఇంత అరాచాకాలు సాగిస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది మిల్లర్లు ఆయన బాటలో నడుస్తున్నారో నివేదికలు సిద్దం చేస్తామన్నారు. అసలు తనకు చెందని వడ్లను తన మిల్లులకు చేర్చుకోవడమే అక్రమ మిల్లర్ చేసిన తప్పు. ఆయనకు మేలు చేసేలా ఇతర మిల్లులకు అన్యాయంచేయడం అదికారులు చేసిన పెద్ద తప్పు. అలా ఇతర మిల్లులకు చెందాల్సిన వడ్లను దింపుకున్న మిల్లర్ జగన్, రైతులను మోసంచేయడం పెద్ద నేరం. ఇంత యధేచ్చగా రైతులను ఒక్క మిల్లర్ మోసం చేస్తుంటే అదికారులు ఏం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అదికారుల్లాగా హన్మకొండ అదికారులు ఎందుకు నిజాయితీగా పనులు చేయడం లేదని వారు నిలదీశారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరక్కుండా చూసుకోవాల్సిన అధికారులు అక్రమ మిల్లర్లకు సహకరిస్తూ నేరాలు చేస్తున్నారని రవి, ఏలెదంర్లు అన్నారు. అక్రమ మిల్లర్లకు సహకరిస్తూ, రైతులను మోసం చేస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకునేలా తాము అన్ని ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకోకపోతే వారికి వ్యతిరేకంగా కూడా పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రైతులను మిల్లర్లు ఇంతగా మోసం చేస్తున్నట్లు ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. నేటిధాత్రి ఎంతో ధైర్యంగా అక్రమ మిల్లర్లు సాగిస్తున్న అవినీతి దందాను బైట పెట్టి, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. సహజంగా మిల్లర్లు చేసే మోసం ఇంత పెద్ద మొత్తంలో వుంటుందని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని, నేటిదాత్రి మూలంగా మిల్లర్ల బాగోతం మొత్తం బైటపడిరదన్నారు. రైతులను ఎన్ని రకాలుగా మిల్లర్లు మోసం చేస్తున్నారో ఒక్కొ అంశం మీద వరస కధనాలు రాయడం సామాన్యమైన విషయం కాదన్నారు. నేటిధాత్రి ఇన్వెస్టిగేషన్ టీమ్ను వాళ్లు అభినందించారు. ఇలాగే సమాజంలో జరుగుతున్న అన్ని అక్రమాలు, మోసాలపై నేటిధాత్రి దృష్టిపెట్టాలని కోరారు. అక్రమ మిల్లర్ల వ్యహారం ఇక రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా తీసుకెళ్లి అక్రమ మిల్లర్ల బండారం బైటపెడతామన్నారు. రైతులను మోసం చేసిన వారికి శిక్ష పడేవరకు తాము ఉద్యమిస్తామని రవి, ఏలేందర్ తెలిపారు.
నేటిధాత్రి జోలికొస్తే ఊరుకోం: అనం చిన్ని వెంకటేశ్వరరావు. జర్నలిస్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు.
సమాజంలో ప్రజా సమస్యలు వెలుగులోకి వచ్చేదే మీడియాతో…అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యకాలాపాలు వెలుగులోకి వచ్చేదే మీడియాతో.. సమాజాభివృద్ది, ప్రగతి కోసం న్యితం ఆరాటపడేది, పోరాటం చేసేదే మీడియా. అలాంటి మీడియా అక్రమార్కులు జీర్ణించుకోలేదు. తమ అక్రమ సంపాదన వదులుకోలేరు. అన్యాయం చేయడం ఆపుకోలేరు. తోటి వారిని మోసం చేయడం మానుకోలేరు. కోట్ల కోసం ఏ గడ్డైనా తింటారు. అశుద్దమైనా ఆనందంగా భుజిస్తారు. అలాంటి వారి మంచి కోరుకోరు. ఎదుటి వారి నాశనమే కోరుకుంటారు. అక్రమాస్దులు కూడబెట్టుకుంటారు. అలాంటి వారికి నేటిధాత్రి దినపత్రిక మీద మాట్లాడే నైతికత వుండదు. ఆ హక్కు కూడా వుండదు. ఓ వైపు రైతులను నిండా ముంచుతూ, ప్రభుత్వాన్ని మోసంచేస్తూ, పర్యావరణాన్ని పాడు చేస్తూ, అన్ని రకాలుగా ప్రకృతిని విధ్వంసం చేస్తూ, సమాజంలో ఆర్ధిక అచారకానికి పాల్పడే వ్యక్తుల గుండెల్లో నేటి దాత్రి అక్షర అంకుశం. అలాంటి నేటిదాత్రిపై ఎలాంటి దాడులకు దిగినా జర్నలిస్టు సంక్షేమ సంఘం చూస్తూ ఊరుకోదు. నేటిధాత్రి యాజమాన్యాన్ని బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాళ్లు సరిదిద్దుకుంటే మంచిది. రైతులను మోసం చేయడం ఆపుకుంటే ఎంతోమంచింది. అంతే కాని తాము చేసే అక్రమాలకు, అన్యాయాలకు నేటిదాత్రి అడ్డొస్తుందని లేనిపోని కుట్రలు చేస్తే తెలంగాణ జర్నలిస్టు సమాజమంతా కదులుతుంది. సమాజానికి మంచి చేసేవారిని ప్రోత్సహించడం, చెడు చేసేవారిని చీల్చిచెండాడడమే మీడియాకు తెలుసు. మీడియాకు శత్రువులంటూ, మిత్రులంటూ వుండరు. కావాలనే మిడియాతో అక్రమార్కులే శత్రుత్వాలు పెంచుకుంటుంటారు. అది అసలే మంచిది కాదు. నేటిధాత్రి యాజమాన్యం, జర్నలిస్టుల జోలికి ఎవరు వచ్చినా జర్నలిస్టు సంక్షేమ సంఘం ఉపేక్షించదు.