రైతన్నకు 500బోనస్ ధర చెల్లించాలని నిరసన.కార్యక్రమం

వేములవాడ నేటిధాత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు పంటకు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రేస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేయడమేనని అన్నారు. రైతన్న పండించిన పంటకు 500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు.
వరి పంటకు 500 బోనస్ , రుణమాఫీ అయ్యే వరకు రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, రైతులను మోసం చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని ఇప్పటి వరకు చేయక పోవడం రైతుల మీద వారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మండల పార్టీల అధ్యక్షులు గోస్కుల రవి, మల్యాల దేవయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, సహకార సంఘాల అధ్యక్షులు ఏనుగు తిరుపతిరెడ్డి, బండ నరసయ్య యాదవ్, రామ్మోహన్ రావు, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, కౌన్సిలర్లు మారం కుమార్ , నిమ్మశేట్టి విజయ్, గోలి మహేష్, గడ్డం హనుమాన్లు, భైరగోని రమేష్, కమలాకర్ రెడ్డి, చీటి రాధా కిషన్ రావు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, సెస్ డైరెక్టర్ ఆకుల గంగరాజం, చీటి సంధ్యారాణి, నరాల దేవేందర్, శ్రీనివాస్ ,గజ్జల రమేష్, సయ్యద్ బాబా, లిక్కిడి మహేందర్, సందీప్, అప్రోజ్, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version