ప్రధాని మోడీ దేశ ప్రజల ఆశీర్వాదంతో నూరేళ్లు జీవించాలి

బిజెపి అర్బన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సంబంధించి ఎన్నో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలిచినటువంటి మహానుభావుడు మూడోసారి మన దేశానికి ప్రధానమంత్రిగా అయినటువంటి నరేంద్ర మోడీ వారన్నారు పార్టీలకతీతంగా కులమతాలకతీతంగా సంఘాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఒకేలాగా చూసే అటువంటి గొప్ప మహానుభావుడు నరేంద్ర మోడీని మధుసూదన్ రెడ్డి అన్నారు కాబట్టి నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు జీవించాలని జిల్లా ప్రాంతీయ వైద్యశాలలో అనారోగ్యంగా ఉన్నటువంటి పేదలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో
సభ్యత్వ సహ ప్రముఖు దొంగ రాజేందర్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి జిల్లా ప్రచార కార్యదర్శి మందుల రఘునాథరెడ్డి రూరల్ ఇన్చార్జి రెంటాల విప్లవ కుమార్ రెడ్డి చెక్క శంకర్ కంచo నరసింహమూర్తి పొన్న శ్రీనివాస్ మధు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *