100 రోజుల పని కూలీలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ధర్మారావుపేట గ్రామం లో జరుగుతున్న రోడ్ వర్క్ పనిని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి , ఆర్డీవో నరేష్ , ఎంపీడీవో ఎల్ భాస్కర్ విజిట్ చేయడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ కూలీలకు విలువైన సూచనలు కొలతల ప్రకారం పని చేసి 300 రూపాయల వేతనం పొందాలి అని చెప్పడం జరిగింది. కూలీలు ఎండలో పనిచేయడం వలన వడాదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది మరియు కూలీలకు ఓ ఆర్ ఎస్ పాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. మండలం లో పెద్ద ఎత్తున ఉపాధి పనులు జరగాలని వాటిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది.ఇందులో ఏ పీ ఓ / ఈసీ రాజు,పంచాయతీ సెక్రటరీ షఫీ, బి ఎఫ్ టి రాజశ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్ సుజాత, కూలీలు పాల్గొన్నారు