చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమము ప్రతి సోమవారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు జారీ చేశారని, తాహశీల్దార్ మహమ్మద్ కాజామైయీనోద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు, కావున చిట్యాల మండల తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించబడును, కావున మండల ప్రజలు ఇట్టి అవకాశమును వినియోగించుకొని భూ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరినారు.