శాంతి భద్రతల పరిరక్షణకే పోలీస్….

శాంతి భద్రతల పరిరక్షణకే పోలీస్….

జిల్లా డిసిపి ఏ భాస్కర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డిసిపి భాస్కర్ తనఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం డీసీపీ భాస్కర్ మాట్లాడారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ,ఏమైనా అలజడి జరిగితే 100
కి ఫోన్ చేయాలని అన్నారు సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
కౌన్సిలర్ ల ప్రమాణ స్వీకారం రోజు జరిగిన అలజడి, మంత్రి కాన్వాయ్ వద్ద జరిగిన అలజడి సృష్టించిన వారిపై వీడియో ఫుటేజ్ ద్వారా సేకరించి కేసులు పెడతామని అన్నారు.శాంతి భద్రతలు ఎవరైనా ఉల్లంఘిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని,ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ రమేష్, ఆర్కేపి ఎస్ఐ శ్రీధర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version