వ్యవసాయ అధికారి వసంత సుగుణ
నిజాంపేట: నేటి ధాత్రి
మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో బుధవారం వ్యవసాయ సంచాలకులు వసంత సుగుణ గ్రామంలోని జీలుగు పంటలను సందర్శించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చి రొట్టె,జిలుగు పంటలను పండించి భూమిలో కలియ దున్నడం వల్ల పోషకాలు పెరిగి పంటలు దిగుబడి పేరుగుతుందన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గి రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామంలో రైతులతో ఈ వర్షాకాలంలో వేస్తున్నటువంటి వివిధ పంటల యజమాన్య పద్ధతుల గురించి, చీడపురుగుల నివారణ గురించి చర్చించడం జరిగిందన్నారు.. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీలత, గ్రామ రైతులు పాల్గొన్నారు.