ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు అవసరం లేదా…?

# నియోజకవర్గంలో అవినీతి రహిత ప్రజాపాలన అందించిన.

# పైలెట్ ప్రాజెక్టుగా పనులు తెచ్చిన ఘనత తనదే..

# నిత్యం ప్రజల కోసమే పనిచేస్తా..

# విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి :

ఉద్యమ నాయకుడు ప్రజల కోసం పోరాటం చేసిన,సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసిన. ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి నేటి వరకు ప్రజల కష్టాలను పంచుకున్న.కరోనా సమయంలో నా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు కడుపులో పెట్టుకొని చూసుకున్న అని మాజీ ఎమ్మెల్యే పెద్ది తెలిపారు.సాధారణ ఎన్నికల్లో ప్రజలు నన్ను అదరించలేదు. కాని
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ప్రజలకు అవసరం లేదా… అని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.
ఐదెండ్లకోసారి వచ్చే నాయకుడిని ప్రజలు కోరుకున్నారు కదా అని తెలుపుతూ ఆ నిర్ణయం పట్ల ప్రజల్లో చర్చ జరగాలని ఆయన సూచించారు.ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమిపాలైన అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట పట్టణంలోని బిఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో తొలిసారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు,నా పని విధానంలో మార్పులు చేసుకోవాలని గమనించానని తెలిపారు.పది సంవత్సరాల కేసిఆర్ పాలనలో నర్సంపేట నియోజకవర్గం పరిధిలో అవినీతి రహిత ప్రజాపాలన అందించిన ఘనత తనదేనని చెప్పారు.నర్సంపేట నియోజకవర్గ పరిధిలో అన్ని రకాల నిధులు,సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా తెచ్చానని అన్నారు.పాకాల, రంగాయ చెరువు కింద కాలువలు పూర్తి చేయాల్సిన పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయని,అలాగే 20 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిలు పోరాడి తెచ్చి ఇటివల శంకుస్థాపన చేసుకున్నాము వాటిని
ప్రస్తుతం గెలిచిన నాయకులు వాటిని పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరారు.వందల సంఖ్యలో నాయకత్వం,వేల సంఖ్యలో కార్యకర్తలు నా వెంట ఉన్నారు. టెక్నికల్ గా అవకాశం ఇవ్వకపోయిన నన్ను మరవచ్చు కాని నేను ప్రజలను మరవను,ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని పెద్ది హామీ ఇచ్చారు.రాజకీయంగా నన్ను దెబకొట్టచాడాని ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఒక్కటయ్యారు అని విమర్శించారు.నేడు నియోజకవర్గ పరిధిలో విజన్ తో ముందుకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. నియోజకవర్గంలో 69 సెంటర్లలో పల్లె దవాఖానలు తెచ్చిన,
పెండింగ్ లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వ అవసరాలకు స్థలాన్ని గుర్తించాం,టెండర్లు పిలిచిన వాటిని పూర్తి స్థాయిలో నిర్మాణపనులు చేయాలని తెలిపారు.
అకాల వర్షాలు, వడగండ్ల వానల వలన రైతులకు పంట నష్టపరిహారం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తో కొట్లాడి రైతులకు,ప్రజలకు ఆపదలో ఆదుకున్న బిడ్డను నేను.ఎన్నికల్లో నాకు ప్రజలు ఈ స్థాయి లో తీర్పు ఇస్తారని ఊహించలేదని అవేదన వ్యక్తంచేశారు.మహిళలకు, యువకులకు ఉపాధి కోసం ట్రైనింగ్ క్యాంపు లు ఏర్పాటు చేశానని ఎన్నో పైలట్ ప్రాజెక్ట్ లు తెచ్చిన ఘనత కూడా తనదేనని తెలిపారు.నాకు రాజకీయలు రావు, ఉద్యమ నేపథ్యంలో వచ్చిన వ్యక్తిని, నాకు కుట్రలు రావు కాబట్టే ప్రజలు నాకు ఈ తీర్పు ఇచ్చారని ఐనప్పటికీ పాజిటివ్ గా తీసుకుంటున్నానని పెద్ది పేర్కొన్నారు.ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యతగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం పనిచేశానని అన్నారు.
హర్టికల్చర్ యునిట్ కోసం ఫారెస్ట్ అధికారులతో కేసులపాలయ్యానని,
అయిన తగ్గకుండా నల్లబెల్లి మండలం కన్నారావుపేటలో రైతులతో మాట్లాడి భూమి సేకరించి హర్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ శంకుస్థాపన చేసుకున్నామన్నారు.నర్సంపేటలో వందల కోట్ల నిధులు మంజూరు చేసి ఉన్నాయి వాటిని ల్యాప్స్ చేయద్దని
ప్యారాలాల్ డ్రైనేజీ కోసం 4 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని వాటిని కూడా పూర్తి చేయాల్సిన అవసరంఉందన్నారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం నా సంపూర్ణ సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రస్తుత ఎమ్మెల్యే గమనించాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాయిడి రవీందర్ రెడ్డి, నాయకులు గుంటి కిషన్, నల్ల మనోహర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, కౌన్సిలర్ అదార్ల రమాదేవి నాగిశెట్టి ప్రసాద్, కోమండ్ల గోపాల్ రెడ్డి, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version