కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలి

వనపర్తి నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను హామీలను అమలు చేయాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు మాజీ జెడ్పిటిసి వెంకట య్య యాదవ్ గోపాలకృష్ణ నాయుడు కొత్త గొల్ల శంకర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు ఇప్పుడు రైతులకు పెట్టుబడి ప్రారంభమైందని రైతుల ఖాతాలో రైతుబంధు 15 వేల రూపాయలు జమ చేయాలని రైతు రుణమాఫీ లక్ష నుండి 2 లక్షల వరకురుణ మాఫీ చేయాలని మహిళలకు 2500 రూపాయలు గ్యాస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం సిలిండర్ 500 రూపాయల కు ప్రజలకు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తే మున్సిపల్ ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో మండల ప్రాదేశిక ఎన్నికలలో సింగిల్ విండో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గౌరవించి మళ్లీ కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపిస్తారని అన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అని అన్నారు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ ప్రజలు గిఫ్ట్ ఇచ్చారని అన్నారని రిటర్న్ గిఫ్ట్ చంద్ర బాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ద్వారా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి రిట న్ గిఫ్ ఇచ్చారని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఆవుల శ్రీను దస్తగిరి బుచ్చారావు యాదయ్య వెంకటాచారి వి బాలయ్య గట్టు రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా వనపర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా మెగా రెడ్డిని గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version