మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజు

కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:

శనివారం కేసముద్రం మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను సి ఐ టి యు మండల కార్యదర్శి జల్లే జయరాజ్ సందర్శించారు.మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్ తగ్గించడంలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు.కానీ మధ్యాహ్న భోజన కార్మికులు మధ్యాహ్న భోజన కార్యక్రమం విజయవంతం చేయడంలో బయట అప్పులు తెచ్చి నెలల తరబడి బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం మిడ్ డే మీల్స్ కార్మికులకు నెలకు రూ. 3,000 వేల వేతనం ఇస్తామని చెప్పి జీవో 8 జారీ చేసి సంవత్సరం కావస్తున్నా కార్మికులకు వేతనాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనీ ఆరోపించారు.వారానికి మెనూ ప్రకటించిన విద్యాశాఖ మంత్రి బిల్లులు చెల్లించడంలో జాప్యం ఎందుకు జరుగుతుందనీ ప్రశ్నించారు.ఇప్పటికైనా అధికారులు రాష్ట్ర,ప్రభుత్వం స్పందించి తక్షణమే వేతనాలు,కోడిగుడ్ల బిల్లులు ఇతర సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా వంట గదులు లేని చోట వంట గదులు నిర్మించాలని,బిల్లులు పెండింగ్లో ఉండకుండా చూడాలని కోరారు.లేనియెడల మిడ్ డే మీల్స్, జిల్లా కమిటీ పిలుపు మేరకు సమ్మెకు వెళ్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లే,శోభ ఘనపరపు,శ్రీలత ,ఏం.శోభ,సుగుణ,నీలక్క భాగ్యలక్ష్మి ,శోభా,జి.లలిత, కే.లలిత,విజయ,శీలం జ్యోతి,మెంతుల ఉపేంద్ర,దారావతు లక్ష్మి ,లలిత,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version