కళ్యాణాలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లా

ప్రజల క్షేమమే కేసీఆర్ లక్ష్యం-చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి(టౌన్)
తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ అండగా నిలిచేది,వారి శ్రేయస్సు కోరేది ఒక్క కేసీఆర్, గులాబీ జెండా మాత్రమేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.పరకాల పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పరకాల మున్సిపాలిటీ,పరకాల, నడికుడ మలాలల్లోని వివిధ గ్రామాలకు చెందిన 133 మంది కల్యాణలక్ష్మి,శాధిముబారక్ లబ్ధిదారులకు గాను రూ.1 కోటి 33 లక్షల 15 వేలకు పైగా విలువచేసే చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని,తెలంగాణ ప్రజల సంక్షేమమే కేసీఆర్ అసలు అజెండా అని అన్నారు. కాంగ్రెస్,బీజేపీలది ఓట్ల ఆరాటమైతే కేసీఆర్‌ది తెలంగాణ ప్రజల బతుకుదెరువు,అభివృద్ది ఆరాటమన్నారు.కాంగ్రెస్ ప్రజలను గోస పెట్టే పార్టీ అయితే,బీజేపీ ప్రజలను మోసం చేసే పార్టీ అని దుయ్యబట్టారు.వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు.గతంలో కాంగ్రెస్ పార్టీ,ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రానికి,ప్రజలకు చేసిందేమిలేదని అన్నారు.
మన రాష్ట్రంలో బి.ఆర్.ఎస్.ప్రభుత్వం అమచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏర్పాష్ట్రంలో లేవని తెలిపారు.ప్రతి సంక్షేమ పథకం పార్టీలకు అతీతంగా పారదర్శకంగా ప్రజలకు నేరుగా చేరవేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ, మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version