వి.జగదీశ్వర్ గౌడ్,శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.
శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:- కృష్ణ యూత్ అధ్యక్షులు శ్రీ.అభిషేక్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాయదుర్గం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి మహిళలకు చీరలు మరియు యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్,సీనియర్ నాయకులు మూల వెంకటేష్ గౌడ్,యువ నాయకులు పట్నం రినీష్ రెడ్డి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
యువతను మంచి మార్గంలో నడిపేందుకు మరియు సమాజానికి ఉపయోగపడే విధంగా శ్రీ కృష్ణ యూత్ సభ్యులు ఎల్లవుడు ముందుకు సాగుతున్నారని,గత 23సంవత్సరాలుగా ఎన్నో సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతునందుకు యువతకు ధన్యవాదాలు తెలిపారు,శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించే విధంగా ఎన్నో స్పోర్ట్ మీట్ కార్యక్రమాలను నిర్వహించడం జరుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్ గౌడ్,రోహిత్ గౌడ్,హారతీశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..