పళణి మురుగన్ చెంత.. సూర్య, వెంకీ అట్లూరి
కంగువా, రెట్రో వంటి సినిమాల తర్వాత తమిళ స్టార్ సూర్య నటిస్తోన్న 46వ చిత్రం ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
కంగువా, రెట్రో వంటి సినిమాల తర్వాత తమిళ స్టార్ సూర్య (Suriya) నటిస్తోన్న 46వ చిత్రం ఇటీవల వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మమితా బైజు (Mamitha Baiju) కథానాయికగా నటిస్తోండగా చాలా గ్యాప్ తర్వాత రవీనా టాండన్ (Raveena Tandon) తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండగా రాధిక కీలక పాత్రల్లో నటిస్తుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ (Sitara entertainments) నిర్మిస్తోంది. జీవీ ప్రకాశ్ (G.V.Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఆ మధ్య పూజా కార్యక్రమాలతో సినిమా ఆరంభించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆప్డేట్ ఇచ్చారు.
అయితే.. హీరో సూర్యతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri), నిర్మాత నాగవంశీ (Naga Vamsi) లు గురువారం తమిళనాడులోని పళణి మురుగన్ సుబ్రమణ్య స్వామి (Palani Murugan Temple) ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూన్ 9 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.