అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

హసన్ పర్తి / నేటి ధాత్రి

గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రశాంత్ నగర్, హంటర్ రోడ్డులో గల నంది హిల్స్, హాసన్ పర్తి లోని ఆర్ టి సి కాలనీ, వంగపహడ్, ఆరేపల్లి, హన్మకొండ చౌరస్తా, శాయంపేట, నక్కలపల్లి, తిమ్మాపూర్ మరియు మమూనూరు లో జరుగుతున్న శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్.
ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా రామ భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు అయోధ్యలో ఆనాడు ఏ విధంగా ధర్మ పాలన అందించాడో దేశంలో మోడీ పాలన కూడా అలాగే సాగుతుంది. కావున దేశానికి మోడీ పాలనే శ్రీరామ రక్ష అని రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమాల్లో బిజెపి క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మార్తినేని ధర్మరావు, 66 వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్,
ప్రబారి మురళిదర్ ఆయా డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు హిందూ భక్తులు పాల్గొన్నారు.

అంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణ మహోత్సవం !!

మండలం లో పలు గ్రామాలలో ఘనంగా జరిగిన సీతా రాముల కళ్యాణం !!!* శ్రీరామ నామ స్మరణ తో మారు మోగిన పలు ఆలయాలు!!!
ఎండపల్లి నేటి ధాత్రి
శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలం లోని గ్రామాలలో ఘనంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం జరిగింది,గుల్లకోట లోని వేణు గోపాల స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది.
సమాజ సేవకులు , విగ్రహ దాతలు ముదిగంటి పద్మ రమణా రెడ్డి దంపతులు పాల్గొని స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకు రావడం జరిగింది,ఆలయ అర్చకులు ఆరుట్ల రంగా చార్యులు కళ్యాణ మహోత్సవం జరుపగా,ప్రత్యేక అర్చకుల వేద మంత్రోచ్చారణ ల మధ్య అంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణ మహోత్సవం జరిగింది,భక్త జనం పెద్దసంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది, అలాగే ఆలయాల వద్ద అన్న దాన కార్యక్రమాలు జరుగడం ,భక్తులు ఎంత గానో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ కార్య క్రమంలో,ఎంపిటిసి సభ్యులు గొల్ల పెల్లి శ్రీజ మల్లేష్ గౌడ్, , స్వాములు మహిళలు,భక్తులు పాల్గొన్నారు,అలాగే కొత్త పేట లో ఘనంగా సీతా రాముల కళ్యాణం మహోత్సవం వైభవంగా జరిగింది,మరియు రాజారాంపల్లి,కొండాపూర్,పాత గూడూరు , గొడిశెల పేట మొదలైన గ్రామాల్లో కూడా రాముల వారి ఆంజనేయ ఆలయాల్లోఅంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణం మహోత్సవం జరిగింది

కన్నుల పండుగగా సీతారాముల కల్యాణ మహోత్సవం

చందుర్తి, నేటిధాత్రి:

శ్రీరామనవమి పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల, కట్ట లింగంపేట లింగంపేట జోగాపూర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయంలో కళ్యాణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణ చారి ఆధ్వర్యంలో కన్నుల పండగగా శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన గ్రామంలోని సీతారామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం హోమం , అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం గ్రామ పురవీధుల గుండా శోభాయాత్ర కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని కార్యక్రమానికి గ్రామ ప్రజలు మండల చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆ శ్రీరామచంద్రుని కోరారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మరియు శ్రీ సీతారామ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో సీతారామ మహోత్సవ వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం సారం పెళ్లి గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామంలోని ప్రజలు మాల ధారణ చేసిన హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇట్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవత మూర్తుల విగ్రహాలను గ్రామంలో వీధి వీధిన పురవీధుల్లో హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు ఇట్టి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భారీ ఎత్తున గ్రామంలోని ప్రజలు మహిళలు గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం సూర్యనాయక్ తండాగ్రామంలో శ్రీరామనవమి పురస్కరించు కుని సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అన్ని దానాల లో కన్నా అన్నదానం గొప్పదని సూర్య యూత్ అధ్యక్షుడు లింగునాయక్అన్నారు.హనుమాన్ గుడి ఆవరణలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీఎంపిటిసి రెడ్డి నాయక్,అజ్మీరా దూదా,రఘు,బానోతు రాజు,మాలోతు భాష, సుధాకర్,సునీల్,వినోద్, సూర్యాయూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గుండం శివాలయం లో శ్రీరామ నవమి వేడుకలు

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం పల్లి గుడి తండా శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా పండిత్ భానుప్రసాద్ శాస్త్రి వారి దివ్య కరములచే హైందవ సాంప్రదాయ పద్ధతిలో కనుల పండుగ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి చలువ పందిళ్ళు ముత్యాల తలంబ్రాలు సన్నాయి మేళాలు దివ్య మంగళ హారతులు
వరుడు రామయ్య తండ్రి వధువు సీతమ్మ తల్లి వారి వివాహము ను చుట్టూ నలు మూలాల గ్రామాల నుండి భక్తులు పోటెత్తారు శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణం భక్తులు కనులారాగాంచిరి తీర్థ ప్రసాదములు పానకం స్వీకరించి మహా అన్నదానంలో పాల్గొని భోజనాలు స్వీకరించారు

ప్రగతిసింగారంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు పాల్గొని స్వామి వారికి అమ్మవారికి పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు.అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.వచ్చేబ్రహ్మోత్సవాలు కూడా గ్రామస్తుల సహకారంతో వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కళ్యాణ మహోత్సవం ఇంత వైభవంగా నిర్వహించడానికి సహకరించిన కృషిచేసినగ్రామస్థులకు,నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా దేవాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.

నస్పూర్ సీతారామలయంలో రంగ రంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం

నస్పూర్ (మంచిర్యాల) నేటిదాత్రి

నస్పూర్ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామలయంలో సీతారాముల కల్యాణం మహోత్సవం భక్తులతో కళ్యాణమండపం నిండుగా జన సందోహంతో గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అత్యంత వైభోగపేతంగా వేద పండితుల వేదమంత్రాల తో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని జరిపించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు పాల్గొని ఎంతో ఆనందోత్సవాల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు అన్న ప్రసాద వితరణను రాచకొండ గోపాల్ రావు వారి సోదరులు నిర్వహించారు ఇంక ఈ కార్యక్రమంలో రాచకొండ వారి కుటుంబ సభ్యులు ఎం పి ఓ శ్రీపతి బాపురావు మల్లేష్ పురుషోత్తం రమేష్ గోపాల్ వెంకటేష్ శంకర్ గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అన్నారు

కనుల పండుగ కళ్యాణ మహోత్సవం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామంలో ఈరోజు జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ గ్రామంలోని వీధి వీధినా ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిపించారు ఇట్టి అన్నదాన కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో పద్మనగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మొర శ్రీకాంత్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు గ్రామ మరియు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీలు..

రాములోరి కళ్యాణంలో మహా అన్నదాన కార్యక్రమాలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

గజకేసరి యోగం తో పాటు, ఆశ్లేష నక్షత్రంలో శ్రీరామనవమి వేడుకలు క్యాతనపల్లి పుర పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కోదండ రామాలయంలో ఘనంగా జరిగాయి.రామాలయంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ నిర్వహించింది, రాములోరి వివాహ మహోత్సవానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు, మందమర్రి ఏరియా జిఎం మనోహర్ దంపతులు హాజరై సీతారాముల ఆశీర్వాదం పొందారు. పెద్దపల్లి పార్లమెంట్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సీతారాముల కళ్యాణం లో హాజరయ్యారు. పట్టణంలోని రాజీవ్ చౌక్ విజయ గణపతి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పుర పరిధిలోని గద్దెరాగడి, శేషుపల్లి, దుబ్బపల్లి, కుర్మపల్లి, అమరవాధి, క్యాతనపల్లి ఎక్స్ రోడ్డు వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయాల్లో సైతం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీల సభ్యులు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భారీ కూలర్లు మంచినీటి సౌకర్యం మజ్జిగ పంపిణీ క్యూ లైన్ లు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్సై రాజశేఖర్ ఆలయాల సమీపాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాములోరి కళ్యాణం అనంతరం ఆలయాలలో మహాఅన్నదాన కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాములోరి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు.

 వనం వీడి జనంలోకి రండి

# కాలం చెల్లిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు కోల్పోవద్దు

# జనజీవన స్రవంతిలో కలవండి మీ కుటుంబ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి

# లొంగిపోయిన మావోయిస్ట్స్ ల ఉపాధి మా భాద్యత*

జిల్లా ఎస్పి డా. శబరిష్ ఐపిఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పని చేయుచున్న అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీస్ ఎదట లొంగిపోవాలని ములుగు పోలీస్ వారి విజ్ఞప్తి. నిషేధిత సిపిఐ మావోయిస్టు సిద్ధాంతాలు కాలం చెల్లినవని వారి భావజాలం ప్రజల్లో ప్రాముఖ్యం కోల్పోయిందని మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదు. కొంతమంది అగ్ర నాయకులు కాలం చెల్లిన సిద్ధాంతాలతో సామాన్య ప్రజల జీవితానికి విఘాతం కల్పిస్తూ ఇన్ఫార్మర్ నేపంతో అమాయకపు ఆదివాసులను చంపుతూ, మందు పాతరాలు పేల్చుతూ, తెలంగాణ మరియు చతిస్గడ్ సరిహద్దుల్లో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తునారు తుపాకీ గొట్టం ద్వారా రాజాధికారం సాదించవచ్చు అనే అపోహ వదిలి తెలంగాణ ప్రభుత్వం ఎదుట లోoగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత నేరవేర్చే వ్యక్తిగా ఉండాలని, ములుగు జిల్లా పోలీస్ వారు కోరుచున్నారు. ములుగు జిల్లా నుండి అజ్ఞాతంలో సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేయుచున్న నాయకులు మరియు సభ్యులు ములుగు జిల్లా పోలీస్ ఎదుట లొంగిపోవాలి. లొంగిపోయిన వారికి వారి పేరు మీద ఉన్న నగదు రివార్డును మరియు జీవనోపాధి కోసం వారికి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ద్వారా కృషిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేయు చున్నాము సంప్రదించవలసిన నెంబర్లు ఎస్పి ములుగు 8712670100 ఓఎస్డి ములుగు 8712670101ఏఎస్పి ఏటూరునాగారం 8712670104 డి ఎస్ పి ములుగు 8712670103 ఎటువంటి భయాలకు లోను కావద్దు ధైర్యంగా లొంగిపోండి మీ సంరక్షణ – సంక్షేమం మా బాధ్యత. మీ కుటుంబంతో హాయిగా జీవించండి డా. శబరిష్ పి ఐపిఎస్
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్

చిత్రపురిలో చిత్రవిచిత్ర దోపిడి విన్యాసాలు ఎపిసొడ్‌`3 చిత్రపురిలో నక్షత్రకులు!

https://epaper.netidhatri.com/view/238/netidhathri-e-paper-17th-april-2024%09/3

`దారి దోపిడీదారులను మించిన నయవంచకులు.

`కార్మికుల బతుకులతో ఆటలాడుకుంటున్నారు.

`కార్మికుల జీవితాలను బలిపెడుతున్నారు.

`ఎప్పటికప్పుడు వారిని దోచుకుతింటున్నారు.

`ముప్పై ఏళ్లుగా మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు.

`కొత్త సభ్యత్వాలు ఇవ్వలేదని అబద్ధాలు చెబుతున్నారు?

`అనర్హులకు ప్లాట్లు కట్టబెడుతున్నారు.

`కోట్లకు కోట్లు దండుకుంటున్నారు.

`ఎవరూ సుద్దపూసలు కాదు.

`పెద్దల ముసుగులో కార్మికుల ఎంగిలి తింటున్నారు.

`సినీ లోకం..ఛీ..ఛీ అంటున్నా తుడుచుకుపోతున్నారు.

`ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో వ్యాపారం చేస్తున్నారు.

`పేద కార్మికుల ఉసురుపోసుకుంటున్నారు.

`వాళ్లు మారరు…ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే దారికి రారు.

`కార్మికుల కష్టాలు తీరవు…సొంతింటి కల నెరవేరదు.

`ఆ కల తీరకుండానే ఎంతో మంది చనిపోయారు.

`వారి ఆత్మల మీద కూడా పేలాలేరుకొని తింటున్నారు.

`చిత్రపురి పెద్దలు రాబంధులను మించిపోయారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
చిత్ర పురిలో పెద్దలుగా చెలామణి అవుతున్న వారు నక్షత్రులను మించిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందులో సుద్దపూసలు ఎవరూ లేరు. ఎవరి స్వార్ధం కోసం వారు చిత్రపురిని వాడుకుంటూ, తమ పబ్బం గడుపుకుంటున్నారు. విధిలేని పరిస్దితుల్లో అప్పు చేసిన పాపానికి సత్య హరిశ్చంద్రుడు, అప్పు తీర్చలేక ఎన్ని అవస్థలు పడ్డాడో..చిత్రపురి కార్మికులు కూడా అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంఘాలుగా మారితే సభ్యత్వాలు దక్కితే, వుండడానికి గూడు దొరుకుందన్న ఆశతో మొదలైన చిత్రపురి కార్మికుల ప్రయాణం సొసైటీ కమిటీ దోపిడికి మార్గమైంది. వారికి ఆస్దులు కూడబెట్టే బ్యాంకుగా మారిరంది. పెద్దలు దోచుకుంటూ తింటున్నా ప్రశ్నించలేని స్దితికి చేరింది. ఎప్పుడు ఏ లెక్క చెబుతారో? అర్ధం కాని అయోమయంలో కార్మికులు వున్నారు. హరిశ్చంద్రుడు తనను తాను అమ్ముకున్నా అప్పు తీరనట్లే, నలభై ఏండ్లుగా ఎదురుచూస్తున్నా అసలైన సినీ కార్మికులకు ఇండ్లు అందింది లేదు. వారికి నీడకల్పించింది లేదు. పేరుకు మాత్రం చిత్రపురి. అందులో ఇండ్లు ఎవరికున్నాయి? ఎంత మంది ఇతరులకున్నాయి? ఎంత మంది చేత లక్షలకు లక్షలు కిస్తిలు కట్టించుకొని ఏగవేశారు? ఒక్కొక్క ప్లాటు ఎంత మందికి అమ్ముకున్నారు? ఇలా లెక్కలు తీస్తే చిత్రగుప్తుడి మాయకన్నా పెద్ద మాయా ప్రపంచమే చిత్రపురిలో కనిపిస్తుంది. ఈ విషయంపై గత కొంత కాలంగా నేటిధాత్రి వరుస కధనాలు రాస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ కార్మికలోకంలో కదలిక వచ్చింది. గతంలో గొంత సవరించలేని వాళ్లుంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కొట్లాడి కొట్లాడి అలసిపోయిన వారిలో కూడా నేటిధాత్రి చెబుతున్న నిజాలతో మళ్లీ వారికి ఆశలు చిగిరిస్తున్నాయి. అయితే ఇది కూడా కొంత మంది పెద్దలు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలిసింది.
కార్మికుల కోసం నేటిధాత్రి ప్రయత్నం చేస్తుంటే, కార్మిక లోకం కదులుతుంటే కొత్త నిర్మాణాల కోసం నిధుల సేకరణకు మార్గం ఏర్పడుతుందని చిత్రపురి గద్దలు చంకలు గుద్దుకుంటున్నారట.
అందుకే కార్మికులు మళ్లీ తొందరపడి మోసపోవద్దు. ఎవరినీ నమ్మొద్దు. పెద్దలున్నదే మిమ్మల్ని నమ్మించి, నయ వంచన చేసేందుకు..అది మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. నక్షత్రులకు కన్నా, ఘోరంగా తయారయ్యారు సొసైటీ కమిటీ పెద్దలు. చిత్ర పురిలో పెద్దలుగా చెలామణి అవుతున్నవారు మళ్లీ తమ పబ్బం గడుపుకునే కొత్త వేషం కడుతున్నారు. అందమైన బ్రోచర్లు సృష్టించి, భూతల స్వర్గంగా చిత్రపురిని మార్చుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అదింతా మోసం. .అంతా అబద్దం. నిజానికి ప్రస్తుతం చిత్రపురి సొసైటీ చెబుతున్న వాటిలో ఒక్కటి కూడా నిజం కాదు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. మళ్లీ మీ కళ్లకు గంతలు కట్టాలని చూస్తున్నారు. మీ ఆశలను సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. ముందు సినీ కార్మికులంతా సంఘటితం కండి? అసలు వాస్తవాలు తెలుసుకోండి. అసలు చిత్రపురి కోసం ప్రభుత్వం ఇచ్చిన స్ధలమెంత? ప్రభుత్వానికి నటుడు ప్రభాకర్‌రెడ్డి ఇచ్చింది ఎంత? ఆ స్ధలాలు ఏమయ్యాయి? ఇప్పుడు చెరువు బఫర్‌ జోన్‌ మాత్రమే ఎందుకు మిగిలింది? ఇలాంటి విషయలపై కార్మికులకు పూర్తి అవగాహన ఎంతైనా అవసరం. ఇలాంటి విషయాలు ఏమీ చెప్పకుండా గత నలభై ఏళ్లుగా కార్మికులను మోసం చేస్తున్నారు. ఒకప్పుడు కార్మికులను నమ్మించేందుకు, ఆ భూముల్లో వ్యాపారం చేసుకునేందుకు, వారు రాజకీయంగా ఎదిగేందుకు చిరంజీవి చేత కొందరికి పట్టాలు ఇప్పించినట్లు నటించారు. దాంతో ఎంతో మంది మోసపోయారు. చిరంజీవి చేతుల మీదుగా అందుకునే అవకాశం కొంతమందికే దక్కింది. అది కూడా చిత్రపురి పెద్దల ఆశీస్సులున్నవారికి ఇవ్వడం జరిగింది. వాటిని చూసి మోస పోకండి. చిత్రపురిలో పెద్ద మాయా ప్రపంచమే వుంది. అది తెలుసుకోలేక, సమయం లేక, సినీ కష్టాలు పడుతూ, దాచుకున్న సొమ్మును దోచుకునేందుకు చిత్ర పురి పెద్దలు కాచుకొని వున్నారు. మీ కష్టం కాజేయాలని చూస్తున్నారు.
ప్రస్తుతం చిత్రపురి సొసైటీ అధ్యక్షుడుగా వున్న వ్యక్తి నిమయాలను ఉల్లంఘించి అధ్యక్షుడయ్యాన్నది అందరూ చెబుతున్న మాటే.
అయినా ఎందుకు కార్మికులు స్పందించడం లేదు. ప్రశ్నించిన వారిని కొంత మందిని సొసైటీ కార్యాలయంలోకి పిలిపించుకొని కూడా కొట్టారని అందుకే కార్మికులు , సొసైటీ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు జంకుతున్నారన్న ప్రచారం కూడా వుంది. సాక్ష్యాత్తు ఓ మహిళను కూడా సొసైటీ పెద్దలు కొట్టి, చిక్కుల్లో పడ్డారు. ఆమె వారిపై న్యాయపోరాటం చేస్తోంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇలాంటి వాటిని బైటకు రానివ్వరు. అంతే కాకుండా ఆ మధ్య చాలా ప్లాట్‌లను ముగ్గురు, నలుగురికి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు కూడా వార్తలున్నాయి. తాము పూర్తి సొమ్ము చెల్లించినా, ఒకటో, రెండో కిస్తీల చెల్లింపుల్లో జాప్యం చేశామని చెప్పి, ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ ఇతరులకు చేయించిన సంఘటనలు కూడా వున్నాయి. వాటిపై ఇప్పటీకీ న్యాయపోరాటం చేస్తున్నవారున్నారు. ఇవన్నీ కార్మిక లోకాని తెలియాల్సిన అవసరం వుంది. లేకుంటే వాళ్లు కూడా మోసపోయే అవకాశం వుంది. సొసైటీ కార్యాలయానికి పిలిపించుకొని, కొట్టిన అమ్మాయి చేస్తున్న న్యాయ పోరాటం ఆపాలని, ఇప్పుడు ఆమెను ప్రాదేయపడుతున్నారు. ఇలా అనేక సంఘటనలున్నాయి. దాదాపు పదుల సంఖ్యలో ప్లాట్స్‌ ఒకరికే కాకుండా ఇద్దరు ముగ్గురికి కూడా రిజిస్ట్రేషన్‌ చేసిన సంఘటలను వెలుగు చూశాయి. ఇప్పుడు మీ పరిస్ధితి కూడా అదే అవుతుంది. తస్మాత్‌ జాగ్రత్త. ముందుగా అందమైన మాటలు చెబుతారు. నమ్మిస్తారు. ముందు 30 శాతం అడ్వాన్సు తీసుకుంటారు. నెల నెల కట్టే వాయిదాలలో ఏ మాత్రం తేడా వచ్చినా మిమ్మల్ని పక్కన పెడతారు. అయాకులుగా మీ చేత వాయిదాలు చెల్లించుకుంటారు. ఆఖరుకు ఏదో వాయిదా ఆలస్యమైందని చెప్పి మీకు ప్లాట్‌ లేదంటారు. గతంలో ఇలాంటివి అనేకం జరిగాయి. ఈ విషయం కార్మికులు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. ఈ విషయాన్ని మేం ముందే చెప్పామని, బైలాలో పొందు పర్చామని అప్పుడు నిబంధల గురించి చెప్పి , మిమ్మల్ని మోసం చేస్తారు. చిన్న చిన్న అక్షరాలతో పేజీలకు పేజీలు రాసి వుండే నిబంధనలు ఎవరూ చదువుకోరు. చాలా మందికి ఇంగ్లీషు కూడా రాదు. దాంతో చిత్రపురి సొసైటీ పెద్దలు చెప్పే తియ్యటి మాటలు నమ్మి పెట్టుబడి పెడతారు.
సంపాదనంతా వారి చేతుల్లో పెట్టేస్తారు. ఆఖరుకు మీకు ప్లాట్‌ రాదు.
పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాదు. తిరుపతి హుండీలో వేస్తే పుణ్యమైనా వస్తుంది. చిత్రపురి సొసైటీకి చేరిన పైస తిరిగి అసలే రాదు. దాని కోసమ మళ్లీ కోర్టు ఖర్చులు అదనం. అయినా మీ కేసు తేలేదెప్పుడో… కేసు గెలిచేదెప్పుడో… కేసు గెలిచినా మీకు సొమ్ము వస్తుందన్న నమ్మకం అప్పుడు కూడా వుండదు. సినీ కార్మికులు సొసైటీ పెద్దలు చెప్పే మాటలు నమ్మకండి. అంతే కాదు, మీరు కొనుగోలుకు రావడం లేదని, ఆ ప్లాట్స్‌ను ఇతరులకు అమ్ముకునే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకే ఆ స్ధలాలు కూడా కాపాడుకునే బాధ్యత మీదే…ఎందుకంటే ఆ స్ధలాలు కొనుగోలు చేసింది కార్మికుల సొమ్ముతోనే…నిజానికి 2015 నాటికే కార్మికులు ఎవరు? ఎంత మంది అన్నది ఖరారు చేశారు. ఆ తర్వాత సభ్యత్వాలు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నారు. దానిని సొసైటీ పెద్దలు ఎప్పుడో అతిక్రమించారు. 1994 నుంచి జీడి పాకంలా సాగుతున్న నిర్మాణాలలో మొత్తం 4213 ప్లాట్లకు డిజైన్‌ చేశారు. 2010 నుంచి 2015 వరకు దశలవారిగా ప్లాట్లను అందిస్తూ వచ్చారు. ఇంత వరకు పూర్తయిన కేవలం 2632. ఇంకా పూర్తి దశలో వున్నవి 1581. అవి కూడా పూర్తిదశలో వున్నాయి. అవి కూడ ఎప్పుడో మంగళం పాడేశారు. అనుయాయులకు చాలా వరకు అందించారు. గతంలో వున్న సొసైటీ కమిటీ చైర్మన్‌ సినీ కార్మికులకు కొంత వరకు మేలు చేశాడన్న పేరుంది..కాని ఇప్పుడున్న సొసైటీ చైర్మన్‌ కార్మికులను దోచుకుంటున్నాడన్న ఆరోపణలు అనేకం వున్నాయి. ప్రస్తుతం మళ్లీ కొత్త దుకాణం తెరిచాడు. ట్విన్‌ టవర్లు నిర్మాణం చేస్తున్నట్లు కార్మికులను మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆ స్ధలాలో ఎలాంటి అనుమతులు లేవు. వాటిపై గత ఎపిసోడ్‌లో నేటిధాత్రి పూర్తి స్ధాయి విశ్లేషణ అందించింది. కార్మికుల పక్షాన నేటి ధాత్రి అక్షర పోరాటం చేస్తోంది. మీరు మోస పోవొద్దని మరీ మరీ చెబుతోంది. కార్మికులంతా కలిసి కొత్త సొసైటీ కమిటీ ఎన్నుకుంటే తప్ప చిత్ర పురికి పట్టిన శని పోదని అందరూ అంటున్నారు.

50. తునికాకు ల కట్టకు 5.రూపాయల గిట్టుబాటు ధర చెల్లించాలి

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

చర్ల మండలం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి నూప.పోతయ్య అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవిలో మూడవ పంట అయిన తునికాకు పంట వేసవి వచ్చిందంటే మే నెల మొదటి వారంలో ఆదివాసి ఆదివాసి యేతర గ్రామీణ పేదలు అడవి బిడ్డలు తునికి.ఆకు సేకరించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరుగుతుందని ఎండని సైతం లెక్కచేయకుండా చెట్లు, పుట్టలు,గుట్టలు ఎక్కి అడవి జంతువుల భారి నుంచి తప్పించుకొని తునిగాకు సేకరించడం అంటే ప్రాణాలతో చెలగాటమే అన్నారు అయినా ఆదివాసులు ఇతర పేదలు బ్రతుకు దేరువు కోసం తునికి ఆకు సేకరించాల్సి వస్తుందని ఇంత కష్టపడి తునికి ఆకు సేకరిస్తే సరైన గిట్టుబాటు ధర లేక ఆదివాసులు నష్టపోతున్నారన్నారు. కానీ తునికాకు కొనుగోలు చేసే గుత్తేదారులు ,(కాంట్రాక్టర్లు) మాత్రం కోట్లకు పడగలేత్తుతున్నారని తునికి ఆకు సేకరణలో ఆదివాసులు క్రూర మృగాల దాడిలో గాయపడి మరణిస్తున్న వారికి మాత్రం ప్రభుత్వం గానీ గుత్తేదారులు గాని సరైన నష్టపరిహారం చెల్లించడం లేదని హెచ్చరించారు 50. ఆకుల తునికి ఆకు కట్టకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఆదివాసులను నిలువునా మోసం చేస్తూ ఉన్నారని తునికి ఆకు ఆదివాసులు కోయకపోతే బీడీ పరిశ్రమలు మూతపడతాయని దీని దృష్టిలో పెట్టుకొని 50 ఆకుల తునికి ఆకు కట్టకు కనీసం 5. రూపాయల కిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు తునికాకు సేకరణలో అడవి జంతువుల బారినపడి గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు మరణించిన వారికి 5.లక్షల రూపాయలు చెల్లించాలని అన్నారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు ఇవ్వని తునికాకు బోనస్ ని వెంటనే చెల్లించాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు అడ్డగర్ల.తాతాజీ. తిరుపతిరావు .రామారావు. నాగేశ్వరావు ముత్తయ్య. మంగమ్మ. అనసూర్య.వెంకటనరసమ్మ.భద్రమ్మ.లక్ష్మి.పద్మ.రామయ్య.శ్రీను. సత్యనారాయణ .వెంకట్ రెడ్డి. లక్ష్మయ్య. సావిత్రి. ముత్తమ్మ. రమేష్ కన్నయ్య .గంగయ్య. చిన్న. సింగయ్య. రాంబాబు. సుబ్బయ్య. రాజారావు. నాగరాజు. తదితరులు పాల్గొన్నారు

శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న భద్రాది రామయ్య

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం:ఏప్రిల్ 16
భ‌ద్రాచలంలో శ్రీ సీతా రాముల కల్యాణానికి శ్రీరామ దివ్య క్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేశారు.

రేపు సీతారాముల కల్యా ణం జరగనుంది. అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఇవాళ ఎదరుకోలు ఉత్సవాన్ని పండితులు నిర్వహిస్తున్నారు.ఈరోజు జరిగే శ్రీ రామన వమి కోసం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రూ. 3కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

భద్రాచలంలో సీతారాముల కల్యాణం నేపథ్యంలో ఏర్పా ట్లు చురుగ్గా జరుగుతున్నా యి. రామాలయ ప్రాంగణా న్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు తున్నారు. శ్రీ సీతారాముల కల్యాణం జరిగే మిథిలా కళ్యాణ మంటపాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు.

నేడు ఎదురుకోలు వేడుక‌…
భద్రాద్రిలోని రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రేపు మిధిలా స్టేడియంలో సీతా రామ కల్యాణం జరగనుం ది. రేపు సీతారామ కల్యా ణం… సీతారామ కల్యాణం సందర్భంగా పెద్దయెత్తున భక్తులు భద్రాద్రికి చేరుకుం టున్నారు.

ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఇప్పటికే భద్రాద్రి బాట పట్టారు. భద్రాచలంలోని అన్ని వసతి గృహాలు బుక్ అయి పోయాయి. సీతారామలు కల్యాణాన్ని తిలకించేందుకు ఎక్కువ మంది భక్తులు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు.

ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వీస్తుండటంతో అందుకు తగినట్లు చర్యలు ఆలయ అధికారులు తీసుకున్నారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు దేశ నలు మూలల నుంచి వచ్చే ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల కోడ్ ఉండటంతో ఈ సారి స్వామి వారి కల్యాణానికి ముఖ్యమంత్రి వచ్చే వీలు లేనట్లు తెలు స్తోంది.రూ.3 కోట్ల వ్యయం..
దేవాదాయ శాఖ రూ.2.88 కోట్లు, గ్రామ పంచాయతీ రూ. 26 లక్షలు, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూఎస్, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మొత్తం రూ.3 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి.

స్వామి వారి కళ్యాణానికి మరో రోజు మాత్రమే గడువు ఉండటంతో యుద్ధ ప్రాతి పదికన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగమంతా ఏర్పాట్ల లో తలమునకలై ఉన్నారు. రాములోరి కళ్యాణానికి దేశ నలు మూలల నుంచి లక్ష మందికిపైగా భక్తులు వస్తారనే అంచనాతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

శాంతి నగర్ కాలనీ నందు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు భద్రాచలంలో శాంతి నగర్ కాలనీ నందు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం మహోత్సవము సందర్భంగా దాసరి వెంకటనారాయణ – హారతి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. భద్రాచలం వచ్చిన రామ భక్తులకు అన్నదానం నిర్వహించిన దాసరి వెంకటనారాయణ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రమేష్ గౌడ్, హరీష్, యలమంచిలి చిన్ను తదితరులు పాల్గొన్నారు.

ఫైర్ స్టేషన్ కల కలగానే మిగిలిపోయింది

కాలం గడుస్తున్న ప్రభుత్వాలు మారినా పట్టించుకోని పాలకులు

న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్

ప్రభుత్వాలు మారిన చర్ల మండలంకు మాత్రం అగ్నిమాపక కేంద్రం రావడం లేదు

అగ్ని ప్రమాదాలకు భయబ్రాంతులకు గురవుతున్న పురిగుడిశ ప్రజలు

ఇటీవల కాలంలోఎన్నో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న విద్యుత్ షాక్ సరక్యూట్ తో పంటలు కాలిపోయిన వైరం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

చర్ల మండల కేంద్రంలో గత చాలా సంత్సరాల నుండి పైరు స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిసి అఖిలపక్షంగా ఏర్పడి కొట్లాడుతూనే ఉన్నాం ఐనా ఈ పాలకులకు దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంటుంది ఎటువంటి చలనం లేదని ఈ సందర్బంగా ముసలి సతీష్ మాట్లాడుతూ ఇంకా ఎన్ని ఇల్లు అగ్నికి ఆహుతి అయితే ఫైర్ స్టేషన్ చర్లకు వస్తుంది ఓ ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరు ప్రతి యాట ఊర్లకు ఊర్లు కాలిపోతున్నాయి ఇక్కడనుండి ఈ వలస ఆగవా చర్ల మండలంలో 75%శాతం రెక్కాడితేనే డొక్కాడే ప్రజలు ఉన్నారు చర్ల మండలంలో 28పంచాయతీలు 58గ్రామాలు 50వేల పైబడి ప్రజానీకం ఉంది అని అయన అన్నారు*ప్రతి సంవత్సరం మంటలకు గురై లక్షలాది రూపాయలు నష్టం జరిగి ప్రజలంతా నిజస్రాయలుగా మారిపోతున్నారు కనికరం లేని పాలకులు కనీసం ఫైర్ స్టేషన్ ఇచ్చే పరిస్థితులలో లేరు.
వేసవికాలం అయిపోయే లోపు ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని చూడాలో?అని అయన ఆవేదన వెక్తం చేశారు

చర్ల మండలం లింగాపురం గ్రామంలో నిన్న రాత్రి సుమారు 8. గంటలకు 1.మేడభత్తిని చిన్న నరసింహరావు.. 2.చందు.వీరి ఇద్దరి ఇల్లులు షాక్ సర్కిట్ జరిగి మొత్తం కాలిపోయి సర్వం కోల్పోయారు దాతలుఎవరు ఉన్న ఈ కుటుంబాని సహాయం చెయ్యాలని కోరుతున్నాము..55 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం అక్కడినుండి కుయ్యి కుయ్యి అని గంట రెండు గంటలకు భద్రాచలం నుండి ఫైర్ ఇంజన్ వచ్చే లోపు మా బ్రతుకులు మొత్తం కాలి బూడిదవుతున్నాయి సర్వం కోల్పోతున్నము తప్ప పాలకులలో ఎటువంటి మార్పు లేదు అగ్ని ప్రమాధం జరిగిన కుటుంబాలకు పక్క ఇల్లు కట్టించి ఇవ్వాలని వారి సామానులు పంట కాలిపోయినందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోని 5.లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆవేదన వెక్తం చేసింది
ఇప్పటికైనా మండలంలో ఉన్న నాయకులు ప్రభుత్వంతో మాట్లాడి చర్లలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని మరల ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంమీదనే ఆధారపడి ఉందని దాతలు ఎవరు ఉన్న ఈ కుటుంబాన్ని ఆడుకోవాలనీ మండలంలో ఉన్న ప్రతి వాసులను నాయకులను ప్రజలను వ్యాపార వర్గాలను అధికారులను మీడియా మిత్రులను కోరుతున్నాము.
ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంకు ఉంది అయినా నమ్మకం లెనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో అనేక గ్రామాల తో పాటు నిన్న రాత్రి సుమారు 8.గంటల సమయంలో లింగాపురంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లంతా కాలిపోయి బూడిద అయ్యింది రాత్రింబవళ్లు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పైసా పైసా కూడా పెట్టుకుని ఇల్లు కట్టుకుంటే ఎండాకాలం వస్తే అగ్నికి ఆహుతి అయిపోయి. కన్న కలల మొత్తం బూడిద పాలవుతుంటే ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలందరూ అయోమయ పరిస్థితిలో ఉన్నారు.ఇప్పటికే ఎండలు పెరిగిపోయి ఉన్నాయి ఏ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి చర్ల మండలంలో ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం.గతంలో వామపక్షంగా ఏర్పడి ప్రజల అందరితో అనేక ఆందోళన చేసి ఈ పాలకులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నాం అయినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వ అధికారులు ఆలోచన చేసి ఇప్పటికైనా చర్ల మండలంలో ఫైర్ స్టేషన్ నెలకొల్పాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గా కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో. సర్పంచ్ రాధా మేడ బత్తిని కమల ఎడెల్లి దేవి గుండ్ల రమేష్ జక్క చిన్నక్క మేడ బత్తిని చందు జై రాజు నరసింహ చంటి నాగేశ్వరరావు శ్రీలేఖ చిరంజీవి రాజు తదితరులు పాల్గొన్నారు

రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక సీట్లు సాధించుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది

భద్రాచలం నేటి రాత్రి

ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని నమ్మిన తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ

అభివృద్ధి కోసం శ్రమించే వ్యక్తి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని ప్రజలే గెలిపించుకుంటారు

మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయం కోసం మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోగల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో భద్రాచలం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ సంక్షేమ పాలన కోసం కాంగ్రెస్ పార్టీని నమ్మి రాష్ట్ర ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చారని, ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ ఎన్నికల హామీగా ఇచ్చిన 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలుపరచి ప్రజా పాలన కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇండియా కూటమి విజయం సాధించి, దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారా సమన్యాయ పాలన కోరుకుంటున్నారని, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ అభివృద్ధి కోసం శ్రమించే వ్యక్తి కాబట్టి ప్రజలు ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించడం ఖాయమని ఆయన మాట్లాడారు.
ఈ ఎన్నికల ప్రచారంలో
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాస మల్ల రాము కాంగ్రెస్ నాయకులు అన్నేం రామిరెడ్డి, షబ్బీర్ భాష,మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి, తుమ్మల రాణి, కట్ట కళ్యాణి, మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

18 నుండి ఎంపీ గా పోటీ చేసే అబ్యర్టులు దరఖాస్తుచేసుకోవచ్చు

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 18 నోటిఫికేషన్ తేది నుండి దరఖాస్తు చేసుకోవచ్చని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ సూచించారు.
మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల నోటిఫికేషన్ ప్రక్రియ పై అవగాహన కల్పించారు.
ఏప్రిల్ 18 న నాగర్ కర్నూలు రిటర్నింగ్ అధికారి ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందనీ, వనపర్తి జిల్లా నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నందున నామినేషన్ లు నాగర్ కర్నూలు జిల్లాలో రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుందని నామినేషన్ వేయదలచిన అభ్యర్థులు నేరుగా రిటర్నింగ్ అధికారికి గాని లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేవారు హార్డ్ కాపీలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. అఫిడవిట్ నింపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారుఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు అభర్తులందరికి సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.
ప్రచార అనుమతులు సహాయ రిటర్నింగ్ అధికారి నుండి పొందవచ్చని తెలిపారు.ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ .వి.యం ల మొదటి విడత ర్యాండ మైజేశన్ సైతం పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమవంతు సహకారం అందించాలని ప్రజాప్రతినిధులను కోరారు.వనపర్తి జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి యం. నగేష్, ఆర్డీవో పద్మావతి, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐ.ఎన్.సి నుండి వెనాచారి, త్రినాథ్, బి.జే.పి నుండి వేంకటేశ్వర రెడ్డి, కుమార స్వామి, బి.ఆర్.ఎస్ నుండి సయ్యద్ జమిల్ , సిపిఎం పరమేశ్వరా చారి, యం.ఐ.యం నుండి రహీం, ఎన్నికల సెక్షన్ నుండి కిషన్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మ తల్లి దేవాలయం లో విగ్రహ ప్రతిష్ఠ కు బిజెపి అభ్యర్ధి ఆరూరి కి ఆహ్వానం

హసన్ పర్తి / నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా, హసన్ పర్తి మండలం, నాగారం గ్రామంలో ఏప్రిల్ 26 తేదిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని బిజెపి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన నాగారం గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు.
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు దామేరా రాజు, మాజీ సర్పంచ్ అరుణ్, ఉప అధ్యక్షుడు తాళ్ళ నర్సయ్య, కార్యదర్శి కళ్లెబోయిన మల్లయ్య, రావుల సమ్మయ్య, శేఖర్, సృజన్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

హసన్ పర్తి / నేటి ధాత్రి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ పరిధిలోని పెగడపల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన గొల్లెల మహేందర్ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి అనంతరం అదే గ్రామానికి చెందిన గండ్రతి భాగ్య గారు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అనంతరం 2వ డివిజన్ పరిధిలో గుండ్లసింగారం గ్రామంలో మదాసి సారయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు. అలాగే హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, హనుమకొండ మండల అధ్యక్షుడు మదాసి అజయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళ్ళ తిరుపతి గౌడ్, డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, వర్ధన్నపేట సోషల్ మీడియా ఇంఛార్జి పుట్ట తిరుపతి, హాసన్ పర్తి మండల యూత్ అధ్యక్షుడు సౌరం చరణ్ రవి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version