మా లక్ష్యం రైతుల అభివృద్ధి కోసం

పిఎసిఎస్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి

వీణవంక (కరీంనగర్ జిల్లా)నేటి ధాత్రి:

మా లక్ష్యం రైతుల అభివృద్ధి కోసం చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం
మండల కేంద్రంలోనీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం నిర్వహించగా పాలకవర్గం సంఘ సభ్యులు హాజరయ్యారు. మొదట సీఈఓ ప్రకాష్ రెడ్డి క్రయవిక్రయాల లాభనష్టాలు నివేదికను చదివి వినిపించారు. నివేదికపై సంఘ సభ్యులు మాట్లాడుతూ.. అంశాలపై చర్చించడం తో పాటు యూరియా , ముప్పై ఏడు లక్షల రూపాయలు విలువ గల గన్ని సంచుల పద్దులు సరిగా లేవని అంశాన్ని లేవనెత్తారు. హమాలి చార్జీలు కొందరి రైతులకు మాత్రమే చెల్లించారు. మిగతా వారికి ఎప్పుడు చెల్లిస్తారని అడిగారు. పిఎసిఎస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ 688 మంది రైతులు రుణమాtఫీకి అర్హులయ్యారు. 388 మంది రైతులకు రుణమాఫీ 299 రైతులకు ఇంకా రావాల్సి ఉంది. ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ ను సొసైటీ ఆధ్వర్యంలో రైస్ మిల్ మంజూరు చేయాలని కోరగా దానికి సంబంధించిన భూమిని సేకరించండి మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు.
రైతుల కోసమే పని చేయడమే లక్ష్యంగా సహకార సంఘం నడుస్తుందని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనిచేయడం తో పాటు రైతులందరి సంఘం కాబట్టి సంఘ సభ్యుల, రైతులందరి సూచనలు మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనిచేయడం జరుగుతుంది గతంలో” డీ” గ్రేడ్ ఉన్న సొసైటీని ఇప్పుడు” ఏ “గ్రేడ్ కు తీసుకురావడం తోపాటు సంఘం నూతన భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. త్వరలోనే నూతన భవన నిర్మాణం చేపడుతామని చెప్పారు. గతంలో జరిగిన వాటికి తమకు ఎలాంటి సంబంధం లేదని మా హయాంలో ఎలాంటి తప్పునైనా.. జరుగుతే తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. సంఘ సభ్యులు పాలకవర్గానికి సహకరించాలని సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం కట్కూరి మధుసూదన్ రెడ్డి, గూటం సమ్మిరెడ్డి, రాములు, గెల్లు మల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి, తిరుమల్, సభ్యులు రఘునాథరెడ్డి, రాజిరెడ్డి, సాహెబ్ హుస్సేన్, చింతల శ్యాంసుందర్ రెడ్డి, సంజీవరెడ్డి, శంకర్ యాదవ్, రైతులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version