సంక్షేమంలో తెలంగాణే నంబర్‌వన్‌ ఎమ్మెల్యే చల్లా

 

గృహలక్ష్మి మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మేల్యే,కలెక్టర్ సిక్తా పట్నాయక్

పరకాల నేటిధాత్రి(టౌన్)

ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉందని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు.హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని 266, నడికుడ మండలంలోని 333,పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 362 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరకాల పట్టణంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉందని అన్నారు.బీజేపీ,కాంగ్రెస్‌ల కథ కంచికి చేరిందనే విషయాన్ని మరిచిపోయి ప్రజలకు మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకోవడానికి వస్తున్నారని నిప్పులు చెరిగారు.పేద ప్రజల ఇంటి నిర్మాణానికి ఆర్థికంగా చేయూతనందించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఒక్కో నియోజకవర్గం పరిధిలో 3వేల మంది అర్హులకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. మొదటగా ఇంటి నిర్మాణ పనులు చేసుకున్న వారికి ఈ నెల అకారులోగా మొదటి దఫా డబ్బులు వారీ ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపక్షాలు ఎవరెన్ని కుట్రలు చేసినా,అసత్య ప్రచారాలు చేసిన గ్రామాల్లో ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల, నడికుడ,పరకాల మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ,మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు,రైతుబందు కన్వీనర్లు,సభ్యులు,గృహలక్ష్మి లబ్ధిదారులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version