పాత నేరస్తులు ప్రతివారం వచ్చి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలి

శాంతి భద్రతలకు విఘాతం కలిపిస్తే చట్టపరమైన కఠిన చర్యలు

ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం
మండలంలోని పాతనేరస్తులు ప్రతివారం పోలీస్ స్టేషన్ కు వచ్చి హాజరు పడిపోవాలని ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో ఎస్సై పాత్రికేయులతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల దృశ్య మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని సిపి, ఏసిపి, మంథని సిఐ ల సూచనల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు ప్రజాప్రతినిధులు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. మండలంలోని పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక, వారు ప్రతివారం పోలీస్ స్టేషన్ కు వచ్చి హాజరు పడిపోవాలని ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version