26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు.

నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

నేటిధాత్రి,హైదారాబాద్
తెలంగాణలో ఈ నెల 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.రాష్ట్రంలో అర్హుత ప్రతీ ఒక్కరికీ రేషన్‌ కార్డులు అందిస్తామని పొంగులేటి ప్రకటించారు.అలాగే ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,ఇస్తామని పేర్కొన్నారు.రైతు భరోసా పథకంలో భాగంగా సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.
భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందివ్వనున్నదన్నారు.
రాష్ట్రంలో అర్హత గల పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తామని వివరించారు.వాటిని నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తామని చెప్పారు.
ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version