వడ్డెర ఓబన్న 207వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన బిఆర్ఎస్ నేత రావులపల్లి రాంప్రసాద్

భద్రాచలం నేటి ధాత్రి

*భద్రాచలం పట్టణంలోని ఐటిడిఏ రోడ్ లో భద్రాచలం వడ్డెర కార్మిక సంఘం ఆధ్వర్యంలో వడ్డెర ఓబన్న 207 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ పూలు చల్లి నివాళులర్పించారు…*

అనంతరం వడ్డెర కార్మిక సోదరులకు వడ్డెర ఓబన్న జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ కలిసికట్టుగా ఐక్యంగా ఉండి ప్రభుత్వాల నుంచి వచ్చే రాయితీలు పొందాలని. హక్కులు సాధించాలని అన్నారు..

దేశ స్వతంత్ర పోరాటంలో వడ్డెర ఓబన్న పాత్ర చాలా గణనీయమైందని అన్నారు..

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, మండల నాయకులు అయినాల రామకృష్ణ,బద్ది బాబి, వడ్డెర కార్మిక సంఘం నాయకులు గుంజా చెన్నకేశవ, గుంజ లక్ష్మణ్ బాబు,సాయి, రామకృష్ణ, మల్లయ్య తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version