`నిజానికి, నిర్భయానికి నిదర్శనం ‘‘నేటిధాత్రి’’.
`ఈ పిట్ట బెదిరింపులు ‘‘నేటిధాత్రి’’ చాలా చూసింది.
`రైతు ప్రయోజనాలే నేటిధాత్రి’’కి ముఖ్యం.
`రైతులను మోసం చేసిన వారెవరైనా వదిలిపెట్టం.
`2016 లో ‘‘నేటిధాత్రి’’ రాసిన వార్తకు రాష్ట్రానికే కేంద్రం సబ్సిడీ ఆపేసింది.
`‘‘నేటిధాత్రి’’ చేసింది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం.
`ఆహార భద్రతా చట్టాలు తెలియక జగన్ ఆటలాడుతున్నాడు!
`వ్యవసాయ చట్టాల మీద అవగాహన లేక జగన్ వడ్లు మాయం చేస్తున్నాడు!
`చిన్నా, చితక వ్యవహారం అనుకుంటున్నాడు
`కేంద్ర ప్రభుత్వం అన్ని గమనిస్తోంది.
`కేంద్రం రంగంలోకి దిగితే అసలు సినిమా అప్పుడు తెలుస్తోంది.
`కిలాడి జగన్ ను ఉసిగొల్పుతున్న జగత్ కిలాడీలు ఎవరో ‘‘నేటిధాత్రి’’ కి తెలుసు.
`మిల్లర్ జగన్ చేసిందే అన్యాయం, ఘోరం.. నేరం.
`నేరం చేసి బరితెగిస్తామంటే మీడియా ఊరుకుంటుందా?
`ప్రభుత్వం కళ్లు మూసుకుంటుందా?
`పాపం పండే సమయం చట్ట పరంగా రాకుండా వుంటుందా?
`‘‘నేటిధాత్రి’’ కథనంతో యంత్రాంగం కదలకుండా వుంటుందా?
`సివిల్ సప్లైలో ఎంత మందిని మేనేజ్ చేయగలరు.
`ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ లాంటి వారు ఒక్కరు చాలు.
`ఇంతకాలం తిన్నదంతా కక్కించే రోజు త్వరలోనే వస్తుంది.
`‘‘నేటిధాత్రి’’ ఎప్పుడూ తప్పుడు వార్తలు రాయదు.
`21 సంవత్సరాల ట్రాక్ రికార్డులో మచ్చ లేదు.
`తప్పు చేసిన వారిని వదిలిపెట్టిన సందర్భం అసలే లేదు.
`బట్టలుతికినట్లు ఉతికి అక్షరాలతో ఆరేస్తుంది.
`ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ జగన్ మిల్లులకు నోటీసులిచ్చింది నిజం కాదా?
`2 వేల బస్తాలు మాయమైన సంగతి వాస్తవం కాదా?
`ముగ్గురు బలమైన మంత్రులున్న ఖమ్మం రైతులను మోసం చేయడం అంత సులువనుకున్నావా?
`జగన్ మిల్లుల నుంచి మురుగు నీరు ఇరిగేషన్ కాలువలో కలుస్తున్నది నిజం కాదా?
`ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది నిజం కాదా?
`అనవసరంగా జగన్ ఆటలో అరటిపండౌతున్నాడు.
`జగత్ కిలాడీల బాగోతం బైటకు రాకుండా జగన్ను ముందు పెట్టి ఆడిస్తున్నారు.
`‘‘నేటిధాత్రి’’కి నోటీసులిచ్చి జగన్ మరింత ఇరుక్కున్నాడు.
`తెలంగాణలో మిల్లర్లు మింగిన వడ్ల లెక్కలు వెయ్యి కోట్లౌతుంది.
`రైతులను మోసం చేసిన వారి బండారం బైట పెట్టడం ‘‘నేటిధాత్రి’’ కర్తవ్యం.
`రైతుల వడ్లు జగన్ మాయం చేయడం నేరం.
`ఈ రెండిరటికీ తేడా తెలియక ఎగిరితే జగన్ ఎల్లెలుకల పడడం ఖాయం.
హైదరాబాద్,నేటిధాత్రి:
రైతుల వడ్లు మాయం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న గుమస్తా జగన్ అలియాస్ మిల్లర్ జగన్ నేటిదాత్రి దినపత్రికకు నోటీసులు పంపించారు. జగన్ వ్యవహారం ఎలా వుందంటే దొంగే దొంగ అన్నట్లుంది. ఆరు గాలం కష్టించి రైతులు పండిరచిన వడ్లును అన్యాయంగా మాయం చేసినప్పుడు తాను తప్పు చేస్తున్నానని గుర్తురాలేదా? తాను చేసేది పెద్ద నేరమన్న సంగతి తెలియదా? పొరపాట్లు చేసుకుంటూ పోయే వ్యక్తిని నేటిధాత్రి జగన్ చాలా గొప్ప పని చేశాడంటూ కీర్తించాలనుకుంటున్నాడా?ఏమిటి? చేసిందే పాడు పని. పాపిష్టి పని. పాపపు పని. రైతులను అన్యాయం చేయడమే పెద్ద ఘోరమైనపని. అంతా చేసి తన పరువుకు భంగం కలిగిందని నేటిధాత్రికి నోటీసులు పంపితే బెదిరిపోతుందనుకున్నాడో ఏమో? మిల్లర్ జగన్ చేసినపని అందరికీ తెలుసు. జిల్లా అధికారులకు తెలుసు. జగన్ చేసిన పని ఖమ్మం జిల్లా సివిల్ సప్లయ్ యంత్రాంగానికి తెలుసు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ ఏకంగా జగన్కు చెందిన మిల్లులకు నోటీసులు జారీ చేశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్ సప్లయ్ అదికారులకు సూచించారు. ఖమ్మం జిల్లానుంచి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అయినా జగన్ మేకపోతు గాంభీర్యం ఎక్కడో ప్రదర్శించాల్సిందిపోయి, నేటిదాత్రికి నోటీసులు పంపించి మరింత తప్పు చేసినట్లైంది. నేటిధాత్రి ఇలాంటి పిట్ట బెదిరింపులు గత 24ఏళ్లలో అనేకం చూసింది. జగన్ అనేవ్యక్తి తప్పు చేయకుంటే నేటిధాత్రిలో వార్త అయ్యేదే కాదు. హన్మకొండ జిల్లాల్లో ఏ మిల్లర్ చేయని నీచమైనపని చేసి, తాను సచ్చీలుడినని చెప్పుకునే ప్రయత్నం చేస్తే సమాజం కూడా హర్షించదు. ఇప్పుడిప్పుడే జగన్ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు ఖమ్మం జిల్లా నుంచి ఇది వరకు వచ్చినా, ఇప్పుడు వచ్చిన వడ్ల వివరాలు కూడా అన్నీ త్వరలో పూర్తి వివరాలు రానున్నాయి. పెద్దఎత్తున రైతులను జగన్ చేసిన ఘరానా మోసం వెలుగులోకి వస్తోంది. జగన్ మీద వర్తాల పరంపర ఆగిపోలేదు. ఇప్పుడే మొదలైంది. ముందు ముందు మరిన్ని కథనాలున్నాయి. జగన్ చేసిన తప్పుల లెక్కలు అన్నీ బైటకు వస్తాయి. ఎందుకంటే నేటిధాత్రికి రైతుల ప్రయోజనాలే ముఖ్యం. రైతులను మోసం చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తిలేదు. ఉదారత ప్రదర్శించే అవకాశం లేదు. రైతులను మోసం చేసిన వారు ఎంత పెద్ద వాళ్లైనా సరే నేటి ధాత్రి వదిలిపెట్టదు. పైగా చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా, జగన్ తాను చేసిన సుద్దపూస పని గొప్పగా వుందనుకుంటున్నాడో ఏమో? నేరం చేసి కూడా ఇంకా బరితెగిస్తామంటే నేటిధాత్రి ఊరుకోదు. తప్పులు, మోసాలు చేసిన వారికి పాపం పండే సమయం ఎప్పుడో అప్పుడు వస్తుంది. నేరం చేసిన వారికి శిక్ష తప్పకుండా పడుతుంది. నేటిధాత్రిలో వచ్చిన కథనాలలో తప్పు వుంటే జగన్ మీడియా ముఖంగా వివరాలు వెల్లడిరచవచ్చు. పూర్తి వివరాలు బైట పెట్ట వచ్చు. ఖమ్మం జిల్లా నుంచి జగన్కు చెందిన మిల్లులలో 2వేల వడ్ల బస్తాల మాయాజాలంపై నోటీసులు అందిన మాట వాస్తవం కాదా? తనకు నోటీసులు రాలేదని జగన్ చెప్పగలరా? ఈ వివరాలు ఎందుకు బైట పెట్టడం లేదు. అదికారులు ఎంత మందిని జగన్ మేనేజ్ చేయగలడు. ఎంత కాలం వారు కాపాడగలరు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సినసమయంలో తప్పకుండా వారు స్పందించాల్సిందే. జగన్పై కేసులు నమోదు చేయాల్సిందే. లేకుంటే అధికారులు తమ ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకోవాల్సిందే. జగన్ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లలేదన్న భ్రమల్లో వున్నట్లున్నాడు. రెండు మూడు రోజుల్లో అంతా తేలుతుంది. అప్పుడే తొందరెందుకు? పిల్లికండ్లు మూసుకొని పాలు తాగినట్లు, తన మిల్లులో వడ్లు మాయమైతే గుర్తించేదెవరు అని అనుకున్నాడు. కాని ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ వడ్ల బస్తాల మీద లెక్కలు రాయిస్తారని పసిగట్టలేపోయాడు. రాత్రికి రాత్రి వడ్లు తరలించి, లేవని చేతులు దులుపుకుంటే సరిపోతుందనుకున్నాడు. కాని ఒక సమర్ధవంతమైన ఐఏఎస్ అధికారి సరిగ్గా పని చేస్తే ఎలా వుంటుందో జగన్కు ముందు ముందుతెలుస్తుంది. జగన్ లాంటి అక్రమార్కుల పని పట్టాలంటే ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ లాంటి ఉన్నతాదికారి ఒక్కరు చాలు. ఇంత కాలం తిన్నదంతా కక్కించేందుకు పెద్దగా సమయం పట్టదు. హన్మకొండ జిల్లా సివిల్ సప్లైలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం కూడా కమీషనర్కు వెళ్తూనే వుంది. కమీషనర్ చౌహాన్ అన్నీ గమనిస్తూనేవున్నారు. నేటిధాత్రికి సుద్దపూసలాగా జగన్ నోటీసులు పంపడం కూడా వారి దృష్టికి వెళ్లింది. నేటిధాత్రి అనేది ఒక బ్రాండ్. మీడియా రంగంలో నేటిధాత్రికి ఒక ప్రత్యేకమైన గుర్తింపే కాదు, స్ధానం వుంది. రెండున్న దశాబ్ధాల కాలంలో తప్పుడు వార్తలు రాయడం అన్నది జరిగింది లేదు. ఇప్పటి వరకు తప్పుడు వార్తలనే మచ్చ లేదు. తప్పుల మీద తప్పులు, మోసాల మీద మోసాలు, నేరాలు చేస్తున్న జగన్ తన పరువు గురించి ప్రస్తావించడమే విచిత్రంగా వుంది. నేటిధాత్రికి పంపిన నోటీసుల్లో వడ్ల ప్రస్తావన చేసిన జగన్ తన మిల్లుల నుంచి వెలువడుతున్న కెమికల్ నీరు గురించి ఎందుకు ప్రస్తావించలేదు. తమ మిల్లుల నుంచి వెలువడుతున్న కెమికల్ నీటి ప్లాంట్ల గురించి ఎందుకు చెప్పలేదు. ఆ నీరుంతా ఇరిగేషన్ కాలువలో కలవడం లేదని నిరూపించగలడా? కాలువల్లో పారుతున్న మురుగునీటికి మిల్లుల నుంచి వెలువడుతున్న నీరు కాదని రుజువు చేసుకోలగడా? ఇటు ఇరిగేషన్ శాఖకు నష్టం చేస్తూ, అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డును మోసం చేస్తూ, ప్రజల ప్రాణాలకు హాని తలపెడుతున్న జగన్ కూడా నీతులు వల్లించడమంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. తెలంగాణలో ముగ్గురు మంత్రులున్న ఏకైక జిల్లా ఖమ్మం. అలాంటి జిల్లాకు చెందిన రైతులు మోసం చేస్తే వదిలేస్తారని జగన్ ఎలా అనుకుంటున్నాడో? ఎవరు రక్షిస్తారనుకుంటున్నాడో? ఎందుకంటే జగన్కు పూర్తిగా రైతుల చట్టాలు తెలియనట్లున్నాయి. ఇంత కాలం నేటిధాత్రిలా చెప్పిన మీడియా లేకపోవడం కూడా జగన్కు కలిసొచ్చినట్లుంది. ఆహార భద్రతా చట్టాలు ఎంత పకడ్భందీగా కేంద్రం అమలు చేస్తుందో ఎప్పుడూ విననట్లుంది. 2019కి మందు తెలంగాణలో సివిల్ సప్లైలో జరుగుతున్న అక్రమాలపై నేటిధాత్రి రాసిన వరుస కధనాలతో కదిలిన కేంద్రం సబ్సిడీలు అప్పుడు ఆపేసింది. ఇంత వరకు వాటిని విడుదల చేయలేదు. అంతటి ట్రాక్ రికార్డు నేటిధాత్రి సొంతం. తప్పులు చేసి కూడా పరువు, ప్రతిష్ట అని జగన్ చెప్పుకోవడమే సిగ్గు చేటు. అలాంటి వారిని వదిలిపెట్టిన చరిత్ర నేటిధాత్రికి లేదు. బట్టలుతికినట్లు ఉతికి అక్షరాలతో ఆరేసిన చరిత్ర నేటిధాత్రిది. ఆ సంగతి తెలిసి కూడా జగన్ చేసిన తప్పు సరిదిద్దుకోకుండా నోటీసులు ఇవ్వాలనుకోవడం మరో తప్పుకు కారణమైంది. నేటిధాత్రి చేసేదే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం. ఆ సంగతి జగన్కు తెలియకపోవడం విచారకరం. జగన్ చేసింది చిన్నా చితకా వ్యవహారంకాదు. దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులను మోసం చేసిన మిల్లర్లు ఎంత మందిపై కేసులు నమోదయ్యాయో తెలుసుకుంటే మంచిది. అనేక రాష్ట్రాలలో బస్తా వడ్లు మాయం చేసిన మిల్లర్లపై కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. ఇక్కడ అదికారుల ఉదాసీనతతో మిల్లర్లు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అయినా కిలాడీ జగన్ వెనుక వున్న జగత్ కిలాడీలు ఎవరో కూడా నేటిధాత్రికి తెలుసు. జగన్కు ఉసిగొల్పి ఆట లాడిస్తున్నవారి మాటలతో మొదటికే జగన్ మోసం తెచ్చుకుంటున్నాడు. ఆఖరుకు ఆటలో అరటి పండు కావడమే తరువాయి అన్న సంగతి జగన్ తెలుసుకోలేకపోతున్నాడు. అనసవరంగా సివిల్ సప్లైతో సమస్యలు తెచ్చుకుంటున్నాడు. ఎగదోసే వాళ్లు ఎగదోస్తారు? ఒక్కరిని ముందు పెట్టి ఆడిరచాలనుకుంటారు? కారణం ఇతరులు చేసే తప్పుల మీద చర్చలు రాకుండా చూసుకుంటారు. వడ్ల మాయం సంగతి ఒక్క జగన్కే సొంతం కాదు. తెలంగాణ వ్యాప్తంగా చాల మంది జగన్ లాంటి మిల్లర్లు సాగిస్తున్నారు. అవన్నీ బైటకు వచ్చే సమయం ముందు ముందు వుంది. ఆ లెక్కలన్నీ తేలిస్తే వేల కోట్లవుతున్నాయి. రైతులను ఏఏ మిల్లర్ ఎంత మోసం చేశాడన్నది కమీషనర్ స్ధాయిలో అన్ని లెక్కలున్నాయి. అవి కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయి. అప్పుడు జగన్కే కాదు, అందిరకీ వుంటుంది?