పల్లెల్లో పై చేయి ఎవరిది?

`ఎన్నికల వాతావరణం మొదలైంది!

`మూడు నెలల్లో ఎన్నికలు?

`నేటిధాత్రి ప్రాథమిక సర్వేలో కాంగ్రెస్‌ పై చేయి కనిపిస్తోంది.

`అధికారంలో వుండడం కాంగ్రెస్‌ కు అదనపు బలం.

`పల్లెల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ కొంత బలంగానే వుంది!

`ప్రజా వ్యతిరేకత పెద్దగా లేదు!

`అలాగని సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ మరింత బలపడిరది లేదు.

`సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదన్న భావన కూడా పెద్దగా వ్యక్తం కావడం లేదు.

`సన్న బియ్యం ప్రభావం కాంగ్రెస్‌ కు అనుకూలం.

`ఇందిరమ్మ ఇండ్లతో కాంగ్రెస్‌ ఓట్లను కొల్లగొట్టే అవకాశం.

`సాగు సమస్యలు, కరంటు కొరత లేదు.

`మొత్తానికి కాంగ్రెస్‌ కు అనుకూలం పవనాలే కనిపిస్తున్నాయి.

-బీఆర్‌ఎస్‌ పార్టీ పరంగా పటిష్ఠంగా వుంది.

-ఓట్ల రూపంలో మేలు జరుతుందా అనే సందేహం మాత్రం వుంది.

-బీఆర్‌ఎస్‌ నాయకులు, క్యాడర్‌ మాత్రం ఉత్సాహంగా వున్నారు.

-కాంగ్రెస్‌ తో పోల్చితే బిఆర్‌ఎస్‌ నాయకులే దూకుడు మీద వున్నారు.

-బీజేపీ బలం కొంత పెరుగొచ్చు.

-ఈసారి పల్లెపోరులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లకు గట్టి పోటీ ఇవ్వొచ్చు.

-పట్టణ ప్రాంతాలకు సమీపంలో వున్న గ్రామాలలో బీజేపీ పుంజుకున్నది.

-హిందుత్వ నినాదం మరింత పెరడం బిజేపికి సానుకూలం.

-బీజేపీ మూడో స్థానమే కొనసాగేలా వాతావరణం కనిపిస్తోంది.

-గతం కన్నా మెరుగైన ఫలితాలు బీజేపీ అందుకోనుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

 తెలంగాణ పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలో ఆ జోష్‌ కనిపిస్తోంది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం వుంది. అందుకు కసరత్తు జరుగుతోంది. దాంతో నేటిధాత్రి ప్రాధమిక సర్వే నిర్వహించింది. ఏ పార్టీ పరిస్ధితి ఎలా వుందన్నదానిపై కొంత అంచనా వేసింది. దాని ప్రకారం ఎంతైనా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుండడం మూలంగా స్దానిక సంస్ధల ఎన్నికలు కొంత అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం వుంది. పైగా పార్టీ తెలంగాణ పల్లెల్లో బలంగానే వుంది. అధికారంలో వుండడంతోపాటు, సంక్షేమ పధకాలు అందాలంటే సహజంగా ప్రజలు కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారని చెప్పడంలో సందేహం లేదు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో చాలా వరకు నిజం లేదు. ప్రభుత్వంపై పల్లెల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. సంక్షేమ పధకాల అమలుపై కూడా పెద్దగా స్పందన లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పే మాటలను కూడా జనం నమ్ముతున్నట్లే వున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగాలేదన్న మాటలు ప్రజలు కూడా అర్దం చేసుకుంటున్నట్లే వున్నారు. కాని ప్రభుత్వాన్ని పెద్దగా నిందించినట్లు కనిపించడం లేదు. కాని ఓ సెక్షన్‌ఆఫ్‌ సోషల్‌ మీడియా చేస్తున్న హడావుడిలో పెద్దగా నిజం లేదు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలప్పుడే బిఆర్‌ఎస్‌ మీడియా లేనిపోని అవాస్తవాలు విపరీతంగా ప్రచారం చేసింది. కాని ప్రజలు కాంగ్రెస్‌, బిజేపిలను మాత్రమే ఆదరించారు. బిఆర్‌ఎస్‌ చేసిన హడావుడి ఎక్కడా కనిపించలేదు. అదికార కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు దూరం చేసుకోలేదు. ఇప్పుడు కూడా పరిస్దితి అలా గుంభనంగానే వుంది. ప్రజలు ప్రభుత్వం వ్యతిరేక అభిప్రాయంతో లేరు. కాకపోతే సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల సందర్భంలో వున్నంత బలంగా కాంగ్రెస్‌ వున్నట్లు కూడా కనిపించడ ంలేదు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రధానంగా పల్లెల్లో ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం ప్రభావం స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వుంటుందనేది కనిపిస్తోంది. పైగా కొత్తగా వచ్చిన రేషన్‌ కార్డులు, వాటి వల్ల ఏకకాలంలో వచ్చిన మూడు నెలల సన్న బియ్యం కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న ఆశాబావం వ్యక్తమౌతోంది. పదేళ్లుగా తెలంగాణ పల్లెల్లో ప్రజలు రెండు పడకల గదుల ఇండ్లపై ఆశలు పెట్టుకున్నారు. కాని కేసిఆర్‌ ఒక్క ఇల్లు కూడా పల్లెల్లో ఇవ్వలేదు. కాని ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తోంది. పట్టాల పంపిణీ కూడా పూర్తయంది. ఇండ్లకు ముగ్గులు పోస్తున్నారు. కొన్ని చోట్ల ఇండ్లు పూర్తయి, గృహప్రవేశాలు కూడా శ్రావణ మాసంలో జరగనున్నాయి. మొత్తానికి ఎన్నికల ముందు పల్లె ప్రజల్లో ఒక ఆనందం మాత్రం కనిపించే పరిస్దితులు కనిపిస్తున్నాయి. పల్లెల్లో రైతులు కూడా పెద్దగా అసంతృప్తితో లేరు. సాగు సమస్యలు ఎక్కడా లేవు. కరంటు కొరత కూడా లేదు. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే స్ధానిక సంస్దల ఎన్నికలు పూర్తిచేస్తే కాంగ్రెస్‌ పరిస్దితి మరోరకంగా వుండేది. ఆ ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌ చేసిన హడావుడి ఉత్తదే అని తేలిపోయింది. కేసిఆర్‌ను ప్రజలు నమ్మలేదు. పార్లమెంటు ఎన్నికల్లో కారుకు ఒక్కసీటు కూడా ఇవ్వలేదు. అదే సమయంలో స్దానిక సంస్దల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు ఎంతో బలం పెరిగేది. కారు పరిస్ధితి మరింత డీలా పడేది. ఆ సమయంలో ఎన్నికలు జరిగితే బిజేపికి పెద్దగా ఉపయోగమయ్యేది కాదు. స్ధానిక సంస్దల ఎన్నికల్లో అధికారపార్టీకి ఎంతో కొంతమేలు జరగడం అన్నది సర్వసాదారణం. పైగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల అమలులో కొన్ని ఎంతో పేరును తెచ్చిపెట్టాయి. ఇక బిఆర్‌ఎస్‌ పరిస్ధితి కూడా కొంత మెరుగైన స్ధితిలోనే వుంది. బిఆర్‌ఎస్‌లో నాయకులు, కార్యకర్తలు బలంగానే వున్నారు. కాంగ్రెస్‌ నాయకులతో పోల్చితే బిఆర్‌ఎస్‌ క్యాడరే ఎక్కువ ఉత్సాహంగా వున్నట్లు కనిపిస్తోంది. స్ధానిక సంస్ధల ఎన్నికలు ఈసారి కూడా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ల మధ్యనే జరిగేలావున్నాయి. కాకపోతే బిఆర్‌ఎస్‌కు బలమైన క్యాడర్‌ వున్నా ఓట్ల రూపంలో సానుకూలత ఏర్పడుతుందా? లేదా? అన్నది కొంత కాలం ఆగితే గాని అర్ధం కాకపోవచ్చు. ఎందుకంటే నాయకులు కోరుకున్నంతగా ప్రజలు ఎన్నికల ఆలోచనల్లో లేరు. బిఆర్‌ఎస్‌కు కూడా కొన్ని మైనస్‌లు చాలా వున్నాయి. గత పదేళ్ల కాలంలో బిఆర్‌ఎస్‌ రేషన్‌కార్డులను తొలగించే ప్రక్రియ చేసింది. వివాదాలు మూట గట్టుకున్నది. ఓడిపోయింది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మోసం చేసింది.ఓటమి పాలైంది. ప్రజలకు సన్నబియ్యం ఇస్తానని చెప్పి బిఆర్‌ఎస్‌ మాట మార్చింది. కాని రేవంత్‌ సర్కారు సన్న బియ్యం ఇస్తోంది. ప్రజలకు కడుపు నిండా అన్నం పెడుతోంది. పదేళ్ల తార్వత ఇందిరమ్మఇండ్ల జోరు సాగుతోంది. రేషన్‌కార్డుల జారీ జరుతోంది. కాని దాన్ని కాంగ్రెస్‌ ప్రచారం చేసుకోలేకపోతోంది. రాష్ట్ర స్దాయిలో ముఖ్యమంత్రి స్దానంలో కూర్చునే శక్తివున్న నాయకులు ఏవరూ లేరు. కాని అవకాశం వస్తే సిఎం. అవుదామనుకుంటున్న వాళ్లున్నారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను మంత్రులు తిప్పికొట్టడంలో విఫలమౌతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మా పని మేం చేసుకుంటూ పోతే చాలు. వివాదాలు ముఖ్యమంత్రి రేవంత్‌ చూసుకుంటారన్న భావనలో వున్నారు. ఇదికూడా కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. ఇక బిఆర్‌ఎస్‌ ప్రజల్లో లేకపోకపోయినా, నాయకులు, కార్యకర్తల హడావుడి మాత్రం సజీవంగానేవుంది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవుల పరిస్దితిపైనే ఆలోచనలున్నాయేగాని, కాంగ్రెస్‌కు వాళ్ల నయాపైసా లాభం లేకుండాపోయింది. లోలోన రగిలిపోతున్నారు. పార్టీ మారినా వారి మనసు ఇంకా కారులోనే వున్నట్లుంది. మరో వైపు సుప్రింకోర్టు తీర్పు ఎలావుంటుందో అన్న భయంలోనే వున్నారు. దాంతో పార్టీకి ఇది కూడా ఇబ్బందికరమైన పరిస్దితినే తెచ్చిపెట్టింది. అయితే కారు బలం ఈ మధ్య కాలంలో ఎంతో కొంత పెరిగిందనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాలల్లో ముఖ్యంగా రైతుల్లో ఎంతో కొంత అసంతృప్తి వుందనేది నిజం. ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ పరమైనసమావేశాల్లో పాల్గొనేందుకు ఇష్టపడడం లేదు. ప్రజల్లోకి వెళ్లడం లేదు. హైదరాబాద్‌ను విడిచి వెళ్లడం లేదు. ఈ విషయంలో సిఎం.రేవంత్‌ రెడ్డి హెచ్చరించినా, ఫలితం లేకుండాపోతోంది. ప్రజల్లోకి వెళ్తే ఆరుగ్యారెంటీలపై ప్రశ్నిస్తున్నారన్న భయం కూడా ఎమ్మెల్యేల్లోవుంది. కాని ఇంకా సమయం వుంది. అన్నీ అమలు చేస్తామని ప్రజలకు నచ్చజెప్పడంలో కాంగ్రెస్‌ నాయకులు విఫలమౌతున్నారు. దాంతో ప్రజలు బిఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు. ఎన్నికల నాటికి పరిస్దితులు ఎలా వుంటాయో చెప్పలేం. కాని కేసిఆర్‌ మీద సానుభూతి పెరుగుతుందనేది వాస్తవం. బిఆర్‌ఎస్‌లో కవిత వ్యవహారం ఆ పార్టీకి ఇబ్బందులు సృష్టించినట్లు కనిపించినా, ప్రజల్లో మాత్రం కేసిఆర్‌ మీద క్రేజ్‌ తగ్గడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో కేసిఆర్‌ స్వయంగా ప్రచారం చేసినా, పామ్‌ హౌజ్‌ దాటి బైటకు రాడని తెలిసినా, ప్రజలు ఇంకా కేసిఆర్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారన్నది కాంగ్రెస్‌నేతలు ఆలోచించుకోవాలి. ఇక బిజేపికి స్దానికంగా పెద్దగా బలం పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పట్టణ ప్రాంతాల్లో వున్న ఆ మాత్రం జోష్‌ కూడా ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు. జాతీయ రాజకీయాల ప్రభావంకూడ బిజేపి మీద కనిపిస్తున్నాయి. బిజేపి ఈ మధ్య ఎలాంటి హడావుడి కూడా చేయడం లేదు. రాష్ట్ర స్దాయిలోనే స్ధబ్దుగా బిజేపి రాజకీయలు కనిపిస్తున్నాయి. అది పల్లె మీద కూడా ప్రభావం చూపుతాయని చెప్పడంలో ఎంలాంటి సందేహం లేదు. గత స్ధానిక సంస్ధల ఎన్నికల కన్నా, ఈసారి బిజేపికి పల్లెల్లో కొంత బలం పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే అవి మెజార్టీ స్ధానిక సంస్ధలను గెల్చుకునేంతగా లేదని మాత్రం చెప్పొచ్చు. పట్టణ ప్రాంతాలకు సమీపంలోవున్న గ్రామాల్లో బిజేపి కొంత బలంగా వుంది. దాని ప్రభావం మున్సిపల్‌ ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. అయితే ముందుగా మున్సిపల్‌ ఎన్నికలు జరిగి, బిజేపికి కొంత అనుకూల వాతావరణ ఏర్పడితే, అది పల్లెలోకూడా కనిపించే అవకాశం వుండేది. పల్లె నుంచి బిజేపి బలం పెరగడం అన్నది ఇప్పట్లో అనుకునంత సాద్యం కాకపోవ్చు. ఏది ఏమైనా రాజకీయ పార్టీల ఉనికి ఎంతోముఖ్యం. నిత్య రాజకీయాలే ఆ పార్టీలకు శరణ్యం. పల్లె పోరులో కాంగ్రెస్‌దే పై చేయి కావొచ్చనేది చాల మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version