మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన జన్నే ఉమారాణి-రాజు దంపతుల కుమార్తె జన్నే సాయి శ్రీ అనే ఏడేళ్ల పాపకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో..తల్లిదండ్రులు హన్మకొండలోని డాల్ఫిన్ పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గురువారం పాప మృతి చెందింది. దీంతో బంధువులంతా డాల్ఫిన్ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాప మృతికి కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే ఆస్పత్రి లైసెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాప మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు.
