మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇంచార్జిగా నియమితులైన శ్రీమతి దీపాదాస్ మున్షి ని హైద్రాబాద్ గాంధీ భవన్ లో జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం లోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన డీసీసీ ఎస్టీ సెల్ కన్వీనర్ వడిత్యవత్ నీల్య నాయక్ ఆమెను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా నియమితులైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ వి. లింగం నాయక్, కొల్లూర్ ఎంపీటీసీ తులసి నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కె.భాస్కర్ నాయక్, ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు ఎల్. ప్రేమ్ కుమార్, కొల్లగుట్ట తండా గ్రామ అధ్యక్షులు వి.భాస్కర్ నాయక్, రాంసింగ్ తండా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సక్ర్రు నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.