జడ్చర్ల సంస్కార్ పాఠశాలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గల సంస్కార్ పాఠశాల నందు జాతీయ విజ్ఞాన దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు తమ యొక్క సృజనాత్మకతను ఉపయోగించి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయునిలా సహకారంతో చాలా ఆవిష్కరణలు(మోడల్స్) ను తమ కు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి నిత్యజీవితంలో మనము చూస్తున్న, వింటున్న విషయాలను ఆహుతులను అలరించే విధంగా చక్కగా రూపొందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిల్ప మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన చంద్రశేఖర వెంకట రామన్ మన అందరికీ తెలిసిన విధంగా (సి.వి.రామన్)ఫిబ్రవరి 28న తాను పరిశోధించిన ఫలితాన్ని ధ్రువీకరించిన రోజు కనుక 1987 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నేషనల్ సైన్స్ డే గా ప్రకటించిందని నాటి నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే గా జరుపుకుంటామని వారు తెలిపారు. భారతదేశం శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక ,విద్య మరియు వైద్య పరంగా అవధులు దాటి అంతరిక్షానికి సైతం వెళ్లడానికి సిద్ధమైన నేటి భారతం మనందరికీ గర్వకారణమని అదేవిధంగా అజ్ఞానం వంటి విజ్ఞానం వైపు చీకటి నుండి వెలుగు వైపుకు నడిపించేది సైన్స్ అని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం రాధిక, గడ్డం సందీప్,తేజశ్రీ, కరుణ, ఆబేదా,భవాని మరియు కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version