ఖమ్మంలో కూరాకుల నాగభూషణం సన్మానసభ

ముఖ్య అతిధులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభ బీఆర్ఎస్ పక్ష నేత,

ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,బీఆర్ఎస్

ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు

ఖమ్మం జిల్లా నేటి ధాత్రి

యాదవ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం బైపాస్ రోడ్డులోని సప్తపది ఫంక్షన్ హాలులో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో నాగభూషణం బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ
ప్రధాని మోడీ తాను బీసీనని చెప్పుకుంటూనే బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నరు
ఆయన పదేళ్ల నుంచి అత్యున్నత పదవిలో ఉన్నా కూడా కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు
మహానేత కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని మోడీ పదేళ్లుగా తొక్కి పెట్టారు
కులగణన చేపట్టాలని అన్ని వర్గాల ప్రజల నుంచి డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నా మోడీ పట్టించుకోవడం లేదు
కులగణన,బీసీ,మహిళా రిజర్వేషన్స్ అమలు జరగాలంటే బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాలని
నామ నాగేశ్వరరావు వంటి బలమైన నాయకుడు పార్లమెంటులో ఉంటేనే ప్రజల న్యాయమైన హక్కులకు పరిష్కారం దొరుకుతుంది
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతునిద్దాం
నామను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం
ఈ కార్యక్రమంలో “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”జై యాదవ జైజై యాదవ”,”బీఆర్ఎస్ లోకసభ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే మన ఓటు”,”గెలిపిద్దాం గెలిపిద్దాం నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం”అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు

ఈ సందర్భంగా రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ ప్రమాణం చేసిన వద్దిరాజు రవిచంద్రను పలువురు యాదవ ప్రముఖులు శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version