కాంగ్రెస్ లో భారీ చేరికలు

@ మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ గెలుపు ఖాయం: దొంతి

@ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

# నెక్కొండ,నేటి ధాత్రి : నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలోని భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన 100 కుటుంబాలు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారందరికీ దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు .ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారిని ఉద్దేశించి శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో నెక్కొండ మండలంలో కనివిని ఎరుగని రీతిలో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కు పడాలని మన సత్తా ఏంటో చూపెడదామని అసెంబ్లీ ఎన్నికల్లో మన సత్తా చాటిన తెలంగాణ రాష్ట్ర ఓటర్లకు ఉందని అందులో మనం కూడా భాగస్వాములు అయినందుకు ఆనందిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఓటర్లను మళ్లీ మభ్యపెట్టి ఓట్లు దండుకునే యత్నం కేసీఆర్ చేస్తున్నాడని, కెసిఆర్ తీరును దొంతి ఎద్దేవ చేశారు. కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ ,పట్టణ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఎడ్ల కృష్ణయ్య, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాచకొండ రఘు , మాజీ ఎంపీటీసీ ఈదునూరి ప్రభాకర్, రామలింగేశ్వర ఆలయ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, కొల్లి సుబ్బారెడ్డి ,పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version