తమిళ రాజకీయాలను కుదిపేసిన మురుగన్‌ మానాడు

`ద్రవిడ రాజకీయాలు తొలిసారి ఎదురవుతున్న ప్రతిఘటన

`క్రమంగా బలపడుతున్న సనాతనధర్మ వాదం

`హిందువులను కట్టేస్తున్న సెక్యులర్‌ సంకెళ్లు

`ఇకముందు కొండలు, ఆలయాల చుట్టూ తమిళ రాజకీయాలు

`పట్టు నిలుపుకోవడానికి డీఎంకే ఆరాటం

`ఆస్తిత్వంకోసం ఏఐడీఎంకే ఆరాటం

డెస్క్‌,నేటిధాత్రి: 

మదురైలో జరిగిన మురుగన్‌ భక్తుల సదస్సు, తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవిడవాద సంస్కృతిని సవాలు చేసింది. గత జనవరిలో విజయవాడ సమీపంలో విశ్వహిందూ పరిషత్‌ సమావేశాన్ని ఇది తలపునకు తెచ్చింది. నాడు సుమారు ఏడులక్షలమంది హిందువులు స్వచ్ఛం దంగా సమావేశంలో పాల్గని తమలోని సంఫీుభావాన్ని వ్యక్తం చేస్తే, జూన్‌ 22న మదురైలో జరిగిన ‘మురుగన్‌ భక్తగళ్‌ ఆన్మీర మనాడు’ పేరుతో హిందూ మున్నాని సంస్థ ఆధ్వర్యంలో నిర్వ హించిన సదస్సు తమిళనాడులో ప్రకంపనలు సృష్టించింది. నిజం చెప్పాలంటే కొన్ని దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి సనాతన ధర్మం, ద్రవిడవాదానికి తన బలమేంటో చూపింది. ద్రవిడ వాద పార్టీలైన ఏఐడీఎంకే, డీఎంకేల్లో ఒక్కసారిగా అంతర్మథనం సాగే రీతిలో ఈ సమావేశం జరగడం విశేషం. మొదట్లో ఏఐడీఎంకే ఈ సమవేశం పట్ల పెద్దగా దృష్టి పెట్టనప్పటికీ, సదస్సు విజయవంతం కావడం చూసి తన మనసు మార్చుకోక తప్పలేదు. ఇది కేవలం మురుగన్‌ భక్తుల సమ్మేళనం మాత్రమే కాదు, ఒక దృఢమైన రాజకీయ సందేశాన్నిచ్చిన వేదికగా మిగిలింది. ఈ సమ్మేళనానికి తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాలనుంచి ఐదులక్షలకు పైగా హిందువులు స్వచ్ఛందంగా హాజరుకావడంతో అధికార డీఎంకే నాయకుల్లో ఒకరకమైన గుబులు ప్రారంభమైంది. అరుపడై వీరు ఆలయాల (తమిళనాడు వ్యాప్తంగా విస్తరించిన అరవై మురుగన్‌ దేవాలయాలు) ప్రతికృతులను తయారుచేసి ఈ వేదికను అలంకరించడం విశేషం. ఈ సందర్భంగా భక్తులు చేసిన మురుగన్‌ భజనల వెనుక ప్రజల్లో అంతర్లీనంగా వున్న హైందవ సంస్కృతి ఒక్కసారిగా బ యటపడిరది. ఈ సమ్మేళనం నిర్వహణకు మదురై నగరాన్ని ఎంపిక చేయడం యాదృచ్ఛికం కాఉ. తమిళ శైవంలో మదురై పట్టణానికి గొప్ప ప్రాధాన్యత వున్నది. ఈ శైవంలో భాగంగా వున్న మురుగన్‌తో ఈ నగరానికి ప్రాచీనకాలం నుంచి అద్భుతమైన అనుసంధానత వున్నది. ఈ నేప థ్యంలోనే హిందువుల అస్తిత్వ ప్రదర్శనకు మదురైని కేంద్రంగా ఎంచుకున్నారు. ఈ సమ్మేళనం లో పాల్గన్న లక్షలాదిమంది భక్తులు, కార్యకర్తలు వేలాయుధాలను (మురుగన్‌/సుబ్రహ్మణ్యస్వామిఆయుధం) ధరించి కాషాయాంబరధారులై రావడంతో నగరం కాషాయరంగుతో కళకళలాడిరది.అంతేకాదు హిందువుల మూడ్‌ను కూడా ఇది స్పష్టంగా తెలియజేసింది. ముఖ్యంగా ద్రావిడ నాస్తికవాదం, బ్రాహ్మణుల పట్ల ఎంతోకాలంగా నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను సవాలుచేసే రీతిలో ఈ సమ్మేళనం కొనసాగింది. అందువల్ల ఇది కేవలం ఆధ్యాత్మిక సమ్మేళనమే కాదు, బలమైన రాజకీయ సంకేతాలను అందించిన సదస్సుగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ద్రావిడవాద ఆధిపత్య ధోరణికి ఒక సవాలు విసిరిందనే చెప్పాలి. 

వండియూర్‌కు సమీపంలోని అమ్మ థిడల్‌లో నిర్వహించిన ఈ సదస్సు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్‌గా నిలిచిపోయింది. మొత్తంమీద ఈ ఈవెంట్‌ అధికార ద్రవిడవాద పార్టీలో ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. ఈ సమ్మేళనం తర్వాత డీఎంకే నాయకులనుంచి వస్తున్న ప్రకటనలు వారిలో నెలకొన్న ఆందోళనను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. మొదట్లో పోలీసులు ఈ సమావేశానికి అనుమతినివ్వడానికి నిరాకరించిన మాట వాస్తవం. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో హాజరయ్యే ప్రజలను నియంత్రించడం చాలా కష్టమవుతుందన్న నెపంతో వారు సదస్సు నిర్వహణను తిరస్కరించారు. దీంతో నిర్వాహకులు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించడం తో, సమ్మేళనాన్ని నిర్వహించేందుకు అనుమతినివ్వడమే కాకుండా, పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య సదస్సు జరపాలని ఆదేశాలు జారీచేయడంతో ప్రభుత్వానికి సదస్సుకు అడ్డంకులు కలిగించడానికి వీలు కాలేదు. కోర్టునుంచి లభించిన అనుమతి దన్నుతో నిర్వాహకులు సాంస్కృతికంగా తమ గళాన్ని మరింత గట్టిగా వినిపించారు. ఈ సమ్మేళనం ధాటికి ద్రవిడవాద సంస్కృతిని సమర్థించే వారిని అస్తిత్వ భయం ఆవహించిందనే చెప్పాలి. 

ఈ సదస్సు మొత్తం ఎనిమిది తీర్మానాలను ఆమోదించింది. ఇవన్నీ ఎంతోకాలంగా కొనసాగుతున్నవే కావడం గమనార్హం. తీర్మానాల్లో ముఖ్యమైంది తిరుప్పురన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడానికి అనుమతినివ్వమని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం. తిరుప్పురన్‌కుండ్రం కేవలం మురుగన్‌ స్వామికి చెందిందేనని సమ్మేళనం స్పష్టం చేసింది. ఈ కొండపై ఒక దర్గాకూడా వు న్న నేపథ్యంలో ఇటీవల హిందూ, ముస్లింల మధ్య స్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ పర్వతం విషయంలో ఇతర మతాలవారితో సమన్వయంగా ముందుకెళ్లే ప్రసక్తే లేదని, ఇది కేవలం హిందువులకు మాత్రమే చెందిందిగా సమ్మేళనం స్పష్టం చేసింది. ఇక రెండో ముఖ్యమైన తీర్మానం, హిందువుల దేవాలయాలు, ధార్మిక సంస్థలపై ప్రభుత్వ ఆధిపత్యం వుండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. హిందువులు మతమార్పిడులను అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. ఇదే సమయంలో కంధ (స్కంధ) షష్టి కవచాన్ని హిందువలు నిత్యం పఠించాలని కోరింది. ఇక హిందువులు కూడా సమైక్యంగా ఉమ్మడిగా తమ ఓటుహక్కును గంపగుత్తగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చింది. ఇతర మతాలవారు ఈవిధంగా సమైక్యంగా ఒకే మాటపై ఓటుహక్కును వినియోగించుకుంటున్నప్పుడు హిందువుల మాత్రం ఎందుకు చీలిపోవాలి? అని సదస్సు నిర్వాహకులు ప్రశ్నించారు.

బీజేపీ బహుకాలంగా తమిళనాడులో పాదం మోపాలని గట్టిగా కృషిచేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ప్రవేశానికి మురుగున్‌ వారథిగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఈవెంట్‌కు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటన జారీచేయడం విశేషం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైలు సదస్సులో పాల్గని బలమైన సందేశాలను ఇచ్చారు. వీరి ప్రసంగాలు పాల్గన్నవారిని మరింత ఉత్తేజితులను చేశాయి. ముఖ్యంగా మురుగన్‌ ఒక దేవుడు మాత్రమే కాదని, తమిళుల గుర్తింపునకు గొప్ప గుర్తు అని స్పష్టం చేయడం ద్వారా ద్రవిడవాదానికి గట్టి సవాలు విసిరారు. పవన్‌ కళ్యాణ్‌ తమిళంలో చేసిన ప్రసంగం ఉర్రూతలూగించింది. ‘‘ఒక ముస్లిం తాను ముస్లింనని గర్వంగా చెప్పుకుంటాడు. ఒక క్రైస్తవుడు తన మతవిశ్వాసాలను నిర్భయంగా పాటిస్తాడు. అదే ఒక హిందువు తాను హిందువును అని చెప్పుకున్నప్పుడే సమస్యలు వస్తున్నాయి. మనదేశంలో అమల్లో వున్న సెక్యూలరిజం ముసుగులో కొనసాగుతున్న గొప్ప దౌర్భాగ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ సదస్సు నేపథ్యంలో ద్రవిడవాద పార్టీగా వున్న ఏఐడీఎంకే ఇరుక్కుపోయింది. ఎందుకంటే పార్టీ ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. పొత్తు ధర్మం కింద దీన్ని సమర్థించడమా లేక ద్రవిడ వాదానికి మద్దతుదారుగా ఖండిరచడమా తెలియక గొంతులో పచ్చివెలక్కాయ పడిన చందంగా కొట్టుమిట్టాడుతోంది. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి సమావేశ నిర్వాహకులకు అభినందనలు పంపి వూరుకున్నారు. అయితే ఏఐడీఎంకేకు చెందిన ఐదుగురు నాయకులు సదస్సులో పా ల్గనడం విశేషం. సదస్సులో వక్తలు హిందూ సంప్రదాయాలకు అనుకూలంగా ఉద్వేగ ప్రసంగాలు చేశారు. ఇదే సమయంలో అనుక్షణం హిందూ సంప్రదాయాలను ఆక్షేపణకు గురిచేస్తున్న ద్రవిడవాదంపై విచుకుపడ్డారు. సమర్థనీయం కానప్పటికీ ద్రవిడవాద ప్రతిపాదకుడు ఇ.వి. రామ స్వామిని విమర్శిస్తూ కొంత మంది మాట్లాడారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న చరిత్ర వక్రీకరణలు, తప్పుడు సిద్ధాంతాలతో తప్పుదోవ పట్టించే ప్రక్రిలను వక్తలు తీవ్రంగా తప్పుపట్టారు. ద్రవిడవాద ఉద్యమం అనుసరించే హిందూ వ్యతిరేక వైఖరిని కొందరు వక్తలు విమర్శించారు. మొత్తంమీద చెప్పాలంటే మురుగన్‌ మానాడు (మహానాడు) ఒక స్పష్టమైన శక్తివంతమైన సందే శాన్ని పంపిందనే చెప్పాలి. ఈ సమావేశంపై ఏఐడీఎంకే మౌనంగా వుండటంతో, డీఎంకే తన దాడులను తీవ్రం చేసింది. దీనిపై ఏఐడీఎంకే వివరణ ఇస్తూ, పార్టీ నాయకులు సమ్మేళనంలో పాల్గన్నప్పటికీ, వారు పార్టీ ప్రతినిధులు కాదని స్పష్టం చేయడం ద్వారా, నష్ట నివారణ చర్యలకుదిగింది. అంతేకాదు ఈ సమ్మేళనంలో చేసిన తీర్మానాలతో తనకు సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది.

దశాబ్దాలుగా ద్రవిడవాదం నాస్తికతను, హేతువాదాన్ని ప్రచారం చేస్తున్నా, కేవలం హిందూమతానికి మాత్రమే వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇతర మతాలను పట్టించుకోవడంలేదు. దీని ప్రతిస్పందనలు తనను దెబ్బతీస్తాయన్న భయంతో డీఎంకే 2024లో పళని పట్టణంలో మురుగన్‌ సదస్సును నిర్వహించింది. ముఖ్యంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా డీఎంకే తీసుకు న్న చర్య ఇది. అయినప్పటికీ దీనికి పెద్దగా స్పందన రాలేదు. అయితే ఇప్పుడు మదురై పట్టణం లో నిర్వహించిన మురుగన్‌ సమ్మేళనం ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు రాజకీయంగా కూడా గొప్ప ప్రభావశీలకంగా జరిగింది. ముఖ్యంగా తమిళ హిందువుల అస్తిత్వానికి ప్రతీకగా నిలవడం గమనార్హం. 

డీఎంకే దాని సహచర పార్టీలు గతంలో హిందూ దేవతలపై దారుణమైన పదజాల ప్రయోగం చేయడాన్ని తమిళులు ఇప్పటికీ మరచిపోలేదు. మనం ఏ విత్తనం నాటిదే అదే మొక్క వస్తుంది. గతంలో తాను చేసిన పనులకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పదు కదా. ఇప్పుడు డీఎంకే తాను హిందువులకు అనుకూలమని చెప్పుకోలేదు. ఇప్పుడు మురుగన్‌ మానాడు, తాము వీర ద్రవిడవాదులుగా భావించే కొందరు తమిళ ఓటర్లకు ఆగ్రహం తెప్పించక మానదు. ఇక ఏఐడీఎంకే తన సైద్ధాంతిక వైరుధ్యాలతో పోరాటం చేయక తప్పదు. బీజేపీ సాంస్కృతిక వివరణ హిందీ`హిందూ`హిందూస్తాన్‌ మాత్రమే కాదు తమిళనాడులు వేల్‌`మురుగన్‌`తమిళ ఔన్నత్యం అనేఅంశాలపై ఆధారపడివుంటుంది. 

ప్రస్తుత పరిణామాలు క్రమంగా ఓటు బాక్స్‌ల్లో ప్రభావం చూపేవిగా మారతాయా అన్నది వేచి చూడాలి. ఒక్కటిమాత్రం నిజం ఒక ముందు ఎంతోకాలం తమిళ ఆత్మ కేవలం బ్యాలట్‌ బాక్స్‌ లకు మాత్రమే పరిమితం కాబోవన్నది మాత్రం నూటికి నూరుపాళ్లు నిజం. దేవాలయాలు, కొండలు, ‘హరోం హర’ అంటూ బిగ్గరగా పఠించే భక్తుల హృదయాల నుంచి ఇవి రూపుదిద్దుకుం టాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version