భూపాలపల్లి నేటిధాత్రి
ఇటీవలే గుండే సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన భూపాలపల్లి మున్సిపాలిటీలో 10వ వార్డు కౌన్సిలర్ బద్ధి సమ్మయ్యను శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి కౌన్సిలర్ బద్ధీ సమ్మయ్య ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోని, ఆరోగ్యంపై మనోదైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు మల్లేష్ యాదవ్, ప్రదీప్, కౌన్సిలర్ బద్ధి సమ్మయ్య కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు