ఎంపీలు వద్దిరాజు,మాలోతు, పసునూరి,మాజీ ఎంపీ సీతారాం నాయక్ భేటీ

*Date 05/03/2024*
—————————————-


బీఆర్ఎస్ మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ అభ్యర్థి మాలోతు కవితకు ఘన విజయం చేకూర్చేందుకు గాను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు పసునూరి దయాకర్,మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ లు భేటీ అయ్యారు.హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసంలో కవిత, దయాకర్,నాయక్ లు ఆయనతో సమావేశమై బీఆర్ఎస్ ఘన విజయమే లక్ష్యంగా, ధ్యేయంగా, అంకితభావంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.ఈ విషయమై సుధీర్ఘంగా చర్చించారు,వ్యూహరచన చేశారు.లోకసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్,నోటీఫికేషన్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో వారు సమాలోచనలు జరిపారు.పార్టీ ప్రముఖుల పర్యటనలు, నాయకుల్ని సమన్వయం పర్చడం,సభలు,సమావేశాల తేదీల ఖరారు,ప్రచారసరళి,కార్యకర్తలకు దిశానిర్దేశం,ప్రజలతో నేరుగా మమేకమవ్వడం,ఎజెండా,సంబంధిత అంశాలపై ఎంపీ రవిచంద్ర, కవిత, దయాకర్,మాజీ ఎంపీ సీతారాం నాయక్ లు సమాలోచన చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version