పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండల పరిధిలోని కామారెడ్డిపల్లి,పోచారం,వెల్లంపల్లి గ్రామాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్ తో కలిసి సందర్శిండం జరిగింది.నర్సరీ లలొ ఇంకా కొన్ని బ్యాగులు ఖాళీ గా ఉన్నందున వెంటనే నారు తెచ్చి నాటాలని సంబందిత పంచాయతీ కార్యదర్శులకు,ఫీల్డ్ అసిస్టెంట్ లకు సూచనలువ్వడం జరిగింది.అనంతరం కామారెడ్డి పల్లి అంగన్వాడీ సెంటర్ తనఖీ చేయగా సెంటర్ కు మిషన్ భగీరథ కనెక్షన్ లేదని టీచర్ తెలుపగా వెంటనే ఆర్.డబ్ల్యు.యస్ ఏ.ఈ తో మాట్లాడి కనెక్షన్ ఇవ్వలని తెలిపారు.కామారెడ్డిపల్లి కాలనీలో నీటి ఎద్దడి నివారణకు ప్రజలతొ మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి రాజకుమారి,ఆర్ డబ్ల్యు యస్ ఏఈ రమణ,మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్,గ్రామ పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు, వాచర్తదితరులు లు పాల్గొన్నారు.
