భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం మంగళవారం నాడు గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫీసు సెక్షన్లో ఇవ్వడం జరిగింది
అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం టీచర్సుల డిప్యూటేషన్ రద్దుఅయ్యాయి ఆశ్రమ పాఠశాల టీచర్స్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ వారికి అందుబాటులో ఉండాల్సింది పోయి గిరిజన బీఈడీ కళాశాలలో తీష్టవేసి కాలాన్ని గడుపుతున్నారు ఇంగ్లీషు ఫిజిక్స్ సబ్జెక్టులను సరిగా బోధించడం లేదని తమకు పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థులు అన్నారు ప్రశ్నించిన విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రాక్టికల్స్ మార్కులను తక్కువ వేస్తున్నారని ఇంగ్లీషు బోధించే టీచర్ ఒకరోజు కళాశాలకు వస్తే మళ్లీ వారం రోజుల వరకు కళాశాలకు రారని ఆ యొక్క టీచర్ ఇంగ్లీష్ బోధించడం రాదని విద్యార్థులు మా దృష్టికి తీసుకువచ్చారు విద్యార్థులు ప్రశ్నిస్తే కోపగించుకుంటుందని గిరిజన విద్యార్థులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు
బిఈడి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పూర్తి సిలబస్ను ఈ ఇంగ్లీష్ టీచర్ పూర్తి చేయలేదని ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయని పరీక్షలలో సమాధానాలను ఏమి రాయాలో అర్థం కాలేక అయమయంలో విద్యార్థులు ఉన్నారని ఐ టి డి ఏ అధికారులకు మాపై ఫిర్యాదు చేస్తే చేస్తే మీపై చర్యలు తీసుకొని టీసీలు ఇస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులకు కాంట్రాక్టు పద్ధతిలో వేరే అధ్యాపకులను నియమించాలని లేనిపక్షంలో రిటైర్డ్ ఉపాధ్యాయులను నియమించాలని కాకతీయ యూనివర్సిటీ నామ్స్ ప్రకారంగా అర్హులైన ఉపాధ్యాయులు బీఈడీ కళాశాలలో ఉండాలనిముక్తకంఠంతో విద్యార్థులు కోరుకుంటున్నారు అలాగే ఐటీడీఏ అధికారులు ఉపాధ్యాయులకు డెమో నిర్వహించి ప్రత్యక్ష బోధన పరిశీలించిన తరువాత నియమించాలని అన్నారు అప్పుడే విద్యార్థుల కు పూర్తి న్యాయం జరిగుతుంది అని అన్నారు. ఈ యొక్క సమావేశంలో మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్ చాప నాగేంద్రబాబు ముక్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.