*Date 21/09/2024*
—————————————-
*బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర కర్ణాటకలోని రాయచూరు మాజీ ఎమ్మెల్యే,మున్నూరుకాపు సమాజం ప్రముఖులు పాపారెడ్డిని ఘనంగా సన్మానించారు*
*పాపారెడ్డి హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఆహ్వానం మేరకు శనివారం సాయంత్రం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసాన్ని సందర్శించారు*
*మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డితో పాటు కలిసి వచ్చిన రాయచూరు మున్నూరుకాపు సమాజం ప్రముఖులు నర్సారెడ్డి, కృష్ణమూర్తి,శేఖర్ రెడ్డి, నర్సింహులు, ప్రతాపరెడ్డి, రాజేందర్ రెడ్డి, మల్లేష్, మహేందర్ రెడ్డి,మునిరెడ్డి,వినయ్ రెడ్డిలకు ఎంపీ వద్దిరాజు సాదర స్వాగతం చెప్పి శాలువాలతో సత్కరించారు, వారి గౌరవార్థం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు*
*ఈ సందర్భంగా మున్నూరుకాపు ప్రముఖులు రౌతు కనకయ్య, డాక్టర్ పీఎల్ఎన్ పటేల్,ఊసా రఘు,మరికల్ పోత సుధీర్ కుమార్,భేతి శ్రీధర్,తెల్లా మురళీధర్,ఆకుల సదానంద్, జెన్నాయికోడే జగన్మోహన్ తదితరులు ఉన్నారు*